మేడ్చల్, జూలై 4: మున్సిపాలిటీల్లో నెలకొన్న సమస్యలు పట్టణ ప్రగతితో సత్వర పరిష్కారానికి నోచుకుంటున్నాయని మేడ్చల్ మున్సిపల్ చైర్పర్సన్ దీపికా నర్సింహా రెడ్డి అన్నారు.మున్సిపాలిటీలోని 18వ వార్డులో పట్టణ ప్రగతిలో భాగంగా కౌన్సిలర్ భవానీతో కలిసి వార్డులోని నెలకొన్న సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇంటింటికి ఆరు మొక్కలు అందజేశారు. వార్డులో సీసీ రోడ్లు, అంతర్గత డ్రైనేజీ ఏర్పాటు కోసం రూ.20 లక్షలు కేటాయిస్తున్నట్లు ఈ సందర్భంగా చైర్పర్సన్ ప్రకటించారు.కమిషనర్ సత్యనారాయణరెడ్డి, మాజీ ఉప సర్పంచ్ నర్సింహారెడ్డి, ప్రజలు పాల్గొన్నారు.
జవహర్నగర్ కార్పొరేషన్లో పట్టణ ప్రగతి, హరితహారంలో భాగంగా 15వ డివిజన్లో మేయర్ మేకల కావ్య ఆధ్వర్యంలో వార్డు సభ నిర్వహించి అనంతరం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి ఆరు మొక్కలు పంపిణీ చేశారు.
తూంకుంట మున్సిపాలిటీలోని 18వ వార్డు పరిధి… దేవర్యాంజాల్లో తడి, పొడి చెత్తపై అవగాహన కల్పించి కరపత్రాలు పంపిణీ చేశారు. అలాగే మహాలక్ష్మి కాలనీలోని పార్కు స్థలంలో పిచ్చి మొక్కలను తొలగించి, మొక్కలు నాటేందుకు గుంతలు తీయించారు. కౌన్సిలర్ ఉమా శ్రీనివాస్, మాజీ సర్పంచ్ శ్రీనివాస్, వార్డు అధికారి భార్గవి, కాలనీవాసులు, మహిళలు పాల్గొన్నారు.
ఘట్కేసర్,జూలై 4 : ఘట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలోని 1,8 వార్డులలో పట్టణ ప్రగతి నిర్వహించారు. చైర్పర్సన్ ముల్లి పావనీజంగయ్య యాదవ్ పాల్గొని వార్డుల కౌన్సిలర్లు వెంకట్రెడ్డి, హేమలతలతో కలిసి ఇంటింటికి ఆరు మొక్కలు పంపిణీ చేశారు.అనంతరం కాలనీల్లో మొక్కలు నాటారు.కమిషనర్ వసంత, నాయకులు ముల్లి జంగయ్య యాదవ్, రమేశ్, వార్డు ప్రజలు పాల్గొన్నారు.
పోచారం మున్సిపాలిటీలో పాత ఇండ్లను అధికారులు, ప్రజా ప్రతినిధులు తొలగించారు. మున్సిపాలిటీ పరిధిలోని 1,2 వార్డులలో పాత ఇండ్లను గుర్తించి జేసీబీ సహాయంతో కూల్చివేశారు. అనంతరం మొక్కలు నాటి ఇంటింటికి మొక్కలు పంపిణీ చేశారు. చైర్మన్ కొండల్రెడ్డి, వైస్ చైర్మన్ రెడ్యానాయక్, కమిషనర్ సురేశ్, కౌన్సిలర్లు మహేశ్, ధనలక్ష్మి నాయకులు పాల్గొన్నారు.
పీర్జాదిగూడ, జూలై 4: పీర్జాదిగూడ నగరపాలక సంస్థ పరిధిలో పచ్చదనం, పరిశుభ్రత పెంపొందించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మేయర్ జక్క వెంకట్రెడ్డి అన్నారు. నగరపాలక పరిధిలో 24, 22, 14వ డివిన్లో నిర్వహించిన పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమంలో మేయర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక కార్పొరేటర్లు హరిశంకర్రెడ్డి, నవీన్రెడ్డి, మంజుల రవీందర్లతో కలిసి మొక్కలు నాటారు. డిప్యూటీ మేయర్ శివకుమార్గౌడ్, కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు.
బోడుప్పల్,జూలై 4: ఉద్యమ స్ఫూర్తితో సాధించుకున్న తెలంగాణను సీఎం కేసీఆర్ నాయకత్వంలో బంగారు తెలంగాణ దిశగా అభివృద్ధిలో పరుగులు పెడుతున్నదని బోడుప్పల్ మేయర్ సామల బుచ్చిరెడ్డి అన్నారు. నగర పరిధిలో 10,23,24డివిజన్లలో నిర్వహించిన పట్టణ ప్రగతిలో ఆయన పాల్గొని మాట్లాడారు. కమిషనర్ శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీరవిగౌడ్, కార్పొరేటర్లు బొమ్మక్ సుగుణబాలయ్య, రమావెంకటేశ్, శ్రీవిద్య, మహేశ్వరి,నాయకులు బాలయ్య, వెంకటేశ్ పాల్గొన్నారు.
మేడ్చల్ రూరల్ : పురపాలక సంఘాలకు కేటాయించిన 10 శాతం గ్రీన్ బడ్జెట్ను వినియోగించుకొని, హరితహారంను విజయవంతం చేయాలని పురపాలక శాఖ కమిషనర్ అండ్ డైరెక్టర్ డాక్టర్ ఎన్.సత్యనారాయణ సూచించారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో చైర్పర్సన్ మద్దుల లక్ష్మీశ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వైస్ చైర్మన్ ప్రభాకర్, కమిషనర్ అమరేందర్ రెడ్డి, డీఈఈ చిరంజీవులు, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు.
మేడ్చల్ కలెక్టరేట్, జూలై 4 : పట్టణాల్లోని ప్రతి వీధి పరిశుభ్రంగా ఉండాలని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. నాగారం, దమ్మాయిగూడ మున్సిపాలిటీలో ఆదివారం నిర్వహించిన హరితహారం, పట్టణ ప్రగతి కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. అనంతరం దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డులలో సీసీ రోడ్లు, అంతర్గత మురుగు కాలువ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం పట్టణ ప్రగతిపై నాగారం 17వ వార్డు, దమ్మాయిగూడ 14వ వార్డులో నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ మున్సిపాలిటీలో ఉన్న సమస్యలు గుర్తించాలని, గుర్తించిన వాటిని పరిష్కరించాలని ఆధికారులు, ప్రజాప్రతినిధులను ఆదేశించారు.
అంతకు ముందు నాగారంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి మంత్రి, ప్రజాప్రతినిధులు, నాయకులు క్షీరాభిషేకం చేశారు. దమ్మాయిగూడ 8వ వార్డుకు చెందిన నేతలు మంత్రి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. అదనపు కలెక్టర్ జాన్ శ్యాంసన్, చైర్మన్లు కౌకుట్ల చంద్రారెడ్డి, వసుపతి ప్రణీత శ్రీకాంత్ గౌడ్, కమిషనర్లు ఎ.వాణిరెడ్డి, స్వామి, వైస్ చైర్మన్లు నరేందర్ రెడ్డి, మల్లేష్, ప్రత్యేక అధికారులు గణేష్, పూర్ణిమ, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తేళ్ల శ్రీధర్, కౌకుట్ల తిరుపతి రెడ్డి, ప్రధాన కార్యదర్శి హరిగౌడ్, శ్రీనివాస్ గౌడ్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.