పాలకుర్తి రూరల్, డిసెంబర్ 8 : సీఎంఆర్ఎఫ్ పేదలకు వరమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సతీమణి ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్టు చైర్ పర్సన్ ఎర్రబెల్లి ఉషా దయాకర్రావు పేర్కొన్నారు. బుధవారం మండల కేంద్రంలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో మండలంలోని టీఎస్కే తండాకు చెందిన డీ సిద్ధార్థకు రూ.60 వేలు, డీ గురువాలి రూ. 22 వేల చెక్కులను ఎంపీపీ నల్ల నాగిరెడ్డితో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా ఉషా దయాకర్రావు మాట్లాడుతూ పేదల సంక్షేమం కోసం మంత్రి దయాకర్రావు నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తున్నారన్నారు. తెలంగాణ ప్రభుత్వం సీఎం కేసీఆర్ ప్రజల సంక్షేమం కోసం సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సర్పంచ్లు డీ బాలూనాయక్, కత్తి సైదులు, ఇమ్మడి ప్రకాశ్, కల్వల భాస్కర్రెడ్డి, పుస్కూరి పార్వతి రాజేశ్వర్రావు, కడుదుల కర్ణాకర్రెడ్డి ఉన్నారు.
తిమ్మాపూర్లో ఒకరికి..
జఫర్గఢ్: మండలంలోని తిమ్మాపూర్కు చెందిన ఎర్ర రాజుకు మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కును బుధవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సర్పంచ్ పొన్నాల జ్యోతి, టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు ఎర్ర నరేశ్, నాగరాజు ఆధ్వర్యంలో ఎర్ర రాజుకు మంజూరైన రూ. 26 వేల చెక్కును అందజేశారు. అనంతరం సర్పంచ్ జ్యోతి, టీఆర్ఎస్ నాయకుడు నరేశ్, నాగరాజు మాట్లాడుతూ ఎమ్మెల్యే టీ రాజయ్య ఆదేశాల మేరకు రాజుకు మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కును పంపిణీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పులి అశోక్, టీఆర్ఎస్ జిల్లా నాయకులు పెండ్లి స్వామి, హరికృష్ణ, గాదరి బాబు, నాయకులు శోభన్, బక్కం రాజిరెడ్డి, శ్రీను, నాగరాజు తదితరులున్నారు.