రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో ఎన్నో హృదయ విదారక దృశ్యాలు కనిపించాయి. చిన్నారి ప్రాణాలతో పోరాడుతుంటే.. తల్లి ఏడుస్తూ చూడటం, రైల్వే స్టేషన్లో ఒంటరై పోయిన పసివాడు, బాంబు షెల్టర్లలో కూర్చొని తమ ప్రాణాలు కాపాడాలని వేడుకుంటున్న చిన్నారులు, బ్రిడ్జి పేలుడులో చిక్కున్న నెలల చిన్నారిని రక్షిస్తున్న సైనికులు.. ఇలా చెప్పుకుంటూ పోతే వీటికి అడ్డే ఉండదు.
ఇప్పుడు కూడా అలాంటి బాధాకరమైన ఘటనే ఉక్రెయిన్లో వెలుగు చూసింది. మర్హాలివ్క ప్రాంతంలో ఒక ఇంటిపై రష్యా మిసైల్ పడింది. దీంతో ఆ కుటుంబంలోని 12 మందిలో 11 మంది దుర్మరణం పాలయ్యారు. ఉక్రెయిన్ విదేశాంగ శాఖ ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. కీవ్లో ఉంటే ప్రాణాలు పోతాయనే భయంతో ఒక వక్తి.. తన కుటుంబాన్ని తీసుకొని మర్హాలివ్క పారిపోయాడని, కానీ అక్కడ కూడా వారి ప్రాణాలకు రక్షణ లభించలేదని తెలిపింది.
సదరు వ్యక్తి తన భార్యను, కుమార్తెను, అత్తగారిని, చెల్లెలిని, అల్లుడిని, మనుమళ్లు, మేనళ్లులు.. అందరినీ కోల్పోయాడని ఉక్రెయిన్ పేర్కొంది. ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఈ యుద్ధం ఆపాలంటూ నెటిజన్లు వేడుకుంటున్నారు.
📍Marhalivka.
This man and his family left Kyiv to be safe. The rocket hit his house, there were 12 people: children (two grandchildren and two nieces), wife, daughter, sister…
Only he and his cat survived.#closeUAskyNOW pic.twitter.com/02cNsfSN4W
— MFA of Ukraine 🇺🇦 (@MFA_Ukraine) March 11, 2022