ఎన్నో ఉద్యమాలు, ఆందోళనలు, నిరసనల మధ్య భారతదేశానికి స్వాతంత్య్రం ఇచ్చేందుకు వీలుకల్పించే చట్టానికి బ్రిటన్ పార్లమెంట్ ఎట్టకేలకు 1947 లో సరిగ్గా ఇదే రోజున ఆమోదం తెలిపింది. దాంతో 200 ఏండ్ల బ్రిటిష్ దాస్యశృంఖలాల నుంచి బయటపడిన భారతదేశం.. స్వతంత్య్ర దేశంగా ప్రకటించుకున్నది. ఇదే చట్టంలో భారతదేశానికి స్వాతంత్య్రం ప్రకటిస్తున్నట్లు పేర్కొనడమే కాకుండా భారత్ను విభజించి పాకిస్తాన్ పేరుతో కొత్త దేశాన్ని ఏర్పాటుచేస్తున్నట్లు కూడా వెల్లడించారు. ఈ చట్టం రావడంతో భారతదేశానికి 1947 ఆగస్ట్ 15 న స్వాతంత్య్రం సిద్ధించింది.
భారతదేశంలోకి వాణిజ్యం కోసం వచ్చిన బ్రిటిష్ వ్యాపారులు మొఘల్ సామ్రాజ్యం బలహీనతలను సద్వినియోగం చేసుకొని అధికారంలోకి వచ్చారు. దాంతో భారతదేశంలోని అన్ని ప్రాంతాల పాలన నేరుగా బ్రిటన్ ప్రభుత్వం చేతుల్లోకి వెళ్ళింది. 1857 లో భారత స్వాతంత్ర్య ఉద్యమం ప్రారంభమైంది. 1900 తర్వాత ఈ ఉద్యమం మరింత బలపడింది.గాంధీజీ దక్షిణాఫ్రికా నుంచి తిరిగి వచ్చి, అహింసా విధానం ద్వారా భారతదేశ స్వాతంత్ర్యాన్ని గట్టిగా కోరడం ప్రారంభించారు.
రెండవ ప్రపంచ యుద్ధం అనంతరం బ్రిటన్ క్రమంగా బలహీనపడింది. భారత్లో పెరుగుతున్న అసంతృప్తి, బ్రిటన్ బలహీనపడటం వంటి కారణాలతో భారతదేశానికి విముక్తి కలిగిస్తామని అప్పటి బ్రిటిష్ ప్రధాన మంత్రి క్లెమెంట్ అట్లీ 1947 ఫిబ్రవరి 20 న ప్రకటించారు. ఆ మేరకు భారతదేశానికి స్వాతంత్ర్యాన్ని అందించే బాధ్యతను లార్డ్ మౌంట్ బాటన్కు అట్లీ అప్పటించాడు. క్లెమెంట్ తొలుత డిక్కీ బర్డ్ ప్లాన్ను ప్రవేశపెట్టగా.. భారత్ తీవ్రంగా వ్యతిరేకించింది. దాంతో జూలై 3 ప్లాన్ను సిద్ధం చేశాడు. ఇదే ప్రణాళిక ప్రకారం భారతదేశానికి స్వాతంత్య్రంతో పాటు పాకిస్తాన్ దేశం ఏర్పాటు కూడా జరిగింది.
1980: భూమి కక్ష్యలోకి ప్రవేశించిన భారత ఉపగ్రహం రోహిణి -1
1976: ఒలింపిక్ క్రీడల్లో తొలిసారి రొమేనియన్ జిమ్నాస్ట్ నాడియా కోమనేసికి పర్ఫెక్ట్-10 స్కోరు లభ్యం
1968: ఇంటెల్ కార్పొరేషన్ ప్రారంభం
1957: బొంబాయి విశ్వవిద్యాలయం స్థాపన
1925: హిట్లర్ ఆత్మకథ ‘మెయిన్ కాంప్’ మొదటి ఎడిషన్ ముద్రణ
1918: దక్షిణాఫ్రికాలో నెల్సన్ మండేలా జననం
1914: దక్షిణాఫ్రికా నుంచి భారతదేశానికి తిరిగి ప్రయాణమైన కరమ్చంద్ గాంధీ
సువేందు మెడకు బాడీగార్డ్ మృతి కేసు
ఆ ఫొటో జర్నలిస్ట్ను మేం చంపలేదు : తాలిబాన్
విద్యార్థులు ‘కట్నం తీసుకోం’ అనే బాండ్ ఇవ్వాలి : కేరళ గవర్నర్
యూజీసీ అకడమిక్ క్యాలెండర్ విడుదల
బరువు తగ్గాలా..? ఈ చిట్కాలు పాటించండి..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..