కాబూల్: ఆఫ్థనిస్థాన్ను మరోసారి తమ ఆధీనంలోకి తెచ్చుకున్న తాలిబన్, కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై చురుగ్గా కసరత్తు చేస్తున్నది. ఇందులో భాగంగా కాబూల్ గవర్నర్, మేయర్తోపాటు ఏడు ప్రభుత్వ పదవులను చేపట్టే వారి పేర్లను మంగళవారం ప్రకటించింది. విద్యాశాఖ అధిపతిగా సఖౌల్లా, ఉన్నత విద్య అధిపతిగా అబ్దుల్ బాకీ, యాక్టింగ్ అంతర్గత మంత్రిగా సదర్ ఇబ్రహీం, ఆర్థిక మంత్రిగా గుల్ అఘా, కాబూల్ కొత్త గవర్నర్గా ముల్లా షిరిన్, కాబూల్ మేయర్గా హమ్దుల్లా నోమాని, ఆఫ్ఘనిస్థాన్ ఇంటెలిజెన్స్ చీఫ్గా నజీబుల్లా నియమితులయ్యారు.
కాగా, ద ఆఫ్ఘనిస్థాన్ బ్యాంక్ (డీఏబీ) యాక్టింగ్ హెడ్గా హాబీ మహ్మద్ ఇద్రిస్ను నియమిస్తున్నట్లు తాలిబాన్ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ సోమవారం ట్వీట్ చేశారు. ప్రజలు ఎదుర్కొంటున్న బ్యాంకు సమస్యలను ఆయన పరిష్కరిస్తారని చెప్పారు. మరోవైపు ఆఫ్ఘన్లో అమెరికా దళాల ఉపంసంహరణ గడువు ఆగస్ట్ 31 సమీపిస్తుండటంతో ప్రభుత్వం ఏర్పాటుపై తాలిబన్ దృష్టిసారించింది. ఒకవేళ ఆ గడువు నాటికి తన బలగాలను అమెరికా వెనక్కి రప్పించకపోతే తీవ్ర పరిణామాలు జరుగుతాయని సోమవారం హెచ్చరించింది.