సర్కారు దవాఖానలో రోగులకు మెరుగైన వైద్యం అందించాలి
కొవిడ్ బాధితులకు ప్రత్యేక చికిత్సలు
జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు
జహీరాబాద్, మే 6 : పేదల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తున్నదని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు అన్నారు. గురువారం జహీరాబాద్ మండలం రంజోల్ గ్రామంలో లబ్ధిదారులకు మంజూరైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పేదింటి ఆడ బిడ్డలకు మేనమామగా కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల ద్వారా ఆర్థిక సహాయం అందజేస్తున్నారని చెప్పారు. కరోనా కష్ట కాలంలోనూ సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. దేశంలో ఏ రాష్టంంలో లేని విధంగా తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. రైతులను ఆర్థికంగా ఆందుకోనేందుకు ప్రభుత్వం రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. కార్యక్రమంలో రంజోల్ టీఆర్ఎస్ నాయ కులు బాసిత్, సత్యనారాయణ పాల్గొన్నారు.
కొవిడ్ బాధితులకు మెరుగైన వైద్యం చేయాలి..
జహీరాబాద్ సర్కారు దవాఖానలో కొవిడ్ బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఎమ్మెల్యే మాణిక్రావు వైద్యాధికారులకు సూచించారు. జహీరాబాద్ పట్టణంలోని సర్కారు దవాఖానను తనిఖీ చేసి వైద్యులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ దవాఖానలో రోగులకు మెరుగైన చికిత్సలు చేసేందుకు మందులు, పరికరాలు, ఆక్సిజన్ అందుబాటులో ఉందన్నారు. రోగులకు పట్ల నిర్లక్ష్యం చేస్తే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. వైద్యులు అందుబాటులో ఉంటూ రోగులకు మెరుగైన చికిత్స చేయాలన్నారు. ఆయన వెంట వైద్యులు, టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.