Pakistan | పాలస్తీనా ప్రజలకు మద్దతుగా పాకిస్థాన్ (Pakistan) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సారి నూతన సంవత్సర వేడుకలను (New Year celebrations ) జరుపుకోకూడదని నిర్ణయించింది. ఈ మేరకు న్యూ ఇయర్ వేడుకలపై సంపూర్ణ నిషేధం విధిస్తున్నట్లు పాకిస్థాన్ ప్రధాని (ఆపద్ధర్మ) అన్వర్ హక్ కాకర్ (Anwaarul Haq Kakar) గురువారం ప్రకటించారు. ఇజ్రాయెల్ జరుపుతున్న దాడుల నేపథ్యంలో గాజా (Gaza)లోని ప్రజలకు సంఘీభావంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
కాగా, గాజా స్ట్రిప్పై ఇజ్రాయెల్ దాళాలు విరుచుపడుతున్నాయి. ఈ దాడుల్లో ఇప్పటి వరకూ 20 వేల మందికిపైగా పాలస్తీనా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. అందులో ఎక్కువగా చిన్నారులు, మహిళలే ఉండటం ఆందోళన కలిగిస్తోంది.
Also Read..
Rajinikanth | విజయకాంత్ బతికుంటే తమిళ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండేవారు : రజినీకాంత్
Donald Trump | ట్రంప్కు మరో షాక్.. అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి అనర్హుడిగా ప్రకటించిన మరో రాష్ట్రం