Charlie Kirk | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సన్నిహితుడు, కన్జర్వేటివ్ కార్యకర్త చార్లీ కిర్క్ (Charlie Kirk) దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఉటాకౌంటీలోని ఉటా యూనివర్సిటీలో (Utah University) ప్రసంగిస్తుండగా ఓ దుండగుడు ఆయనపై తుపాకీతో కాల్పులు జరిపాడు. తీవ్రగాయాలైన చార్లీ కిర్క్ రక్తపు మడుగులో అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో గతంలో భారతీయుల (Indians) గురించి ఆయన పెట్టిన ఓ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.
అందులో భారత్ నుంచి వచ్చే ప్రజలకు అమెరికా మరిన్ని వీసాలు (visas) మంజూరుచేయాల్సిన అవసరం లేదని చార్లీ కిర్క్ వ్యాఖ్యానించారు. చట్టపరమైన వలసల (Legal Immigration) కారణంగా అమెరికన్ కార్మికుల స్థానంలో భారతీయులు చేరిపోయారన్నారు. అమెరికా ఇప్పటికే నిండిపోయిందని.. ఇక స్వదేశీ ప్రజలకు తొలి ప్రాధాన్యం ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైంది అంటూ సెప్టెంబర్ 2న ఎక్స్లో పోస్టు పెట్టారు. ప్రస్తుతం ఆ పోస్ట్ ఇప్పుడు వైరల్గా మారింది.
Also Read..
Charlie Kirk | డొనాల్డ్ ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ దారుణ హత్య.. వీడియో
Nepal: హెలికాప్టర్లకు తాళ్లు కట్టి.. వేలాడుతూ పారిపోయిన మంత్రులు, కుటుంబసభ్యులు.. వీడియో
భారత్పై 100% సుంకాలు విధించండి.. ఈయూను కోరిన ట్రంప్