Mahatma Gandhi | అమెరికాలోని న్యూయార్క్ (New York) నగరంలో జాతిపిత మహాత్మా గాంధీ (Mahatma Gandhi) నూతన విగ్రహాన్ని ఆవిష్కరించారు. శ్రీ తులసీ మందిర్ వెలుపల నూతనంగా ఏర్పాటు చేసిన గాంధీ విగ్రహాన్ని సిటీ మేయర్ ఎరిక్ ఆడమ్స్, న్యూయార్క్ చట్టసభ సభ్యురాలు జెన్నీఫర్ రాజ్కుమార్ ఆవిష్కరించారు.
కాగా, సౌత్ రిచ్మండ్స్ హిల్స్లో ఉన్న గాంధీ విగ్రహాన్ని 2022 ఆగస్టులో దుండగులు ధ్వంసం చేశారు. దీంతో ఆ స్థానంలో కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని అధికారులు భావించారు. ఇందులో భాగంగానే గాంధీ నూతన విగ్రహాన్ని ఏర్పాటు చేసి తాజాగా ఆవిష్కరించినట్లు మేయర్ ఎరిక్ తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. తమ నగరంలో ద్వేషానికి తావు లేదని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.
Also Read..
Amy Jackson | త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్న అమీ జాక్సన్.. ప్రియుడితో ఎంగేజ్మెంట్
Indian student | అమెరికాలో అదృశ్యమైన భారతీయ విద్యార్థి మృతి
London Train: లండన్ మెట్రోరైలులో పంచ్లు విసురుకున్న ప్యాసింజెర్లు.. వీడియో