ఖాట్మండు: నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి ఇవాళ ఆ దేశ పార్లమెంట్ విశ్వాసం కోల్పోయారు. నేపాల్ పార్లమెంట్లో ఇవాళ జరిగిన విశ్వాస పరీక్షలో ఓలీకి అనుకూలంగా 93 ఓట్లు, వ్యతిరేకంగా 124 ఓట్లు వచ్చాయి. మరో 15 మంది సభ్యులు ఓటింగ్లో పాల్గొనకుండా న్యూట్రల్గా ఉన్నారు. ఈ సాయంత్రం 5 గంటలకు సభ ప్రారంభం కాగానే.. ప్రధాని ఓలి విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ఓలి.. దేశ ప్రధానిగా తాను చేసిన కృషి, సాధించిన లక్ష్యాలు తదితర అంశాలను సభకు వివరించారు. అనంతరం ప్రధాని ప్రతిపక్ష పార్టీ అయిన నేపాలీ కాంగ్రెస్ అధ్యక్షుడు షేర్ బహదూర్ దేవుబా, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్ చైర్పర్సన్ పుష్పకమల్ దహల్ విశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా తమ వాదనలు వినిపించారు. అదేవిధంగా జనతా సమాజ్వాది పార్టీ నేతలు మహతో ఠాకూర్, ఉపేంద్ర యాదవ్ కూడా తీర్మానంపై చర్చలో పాల్గొన్నారు.
అన్ని పార్టీల సభాపక్ష నేతలు మాట్లాడిన అనంతరం స్పీకర్ విశ్వాస తీర్మానంపై ఓటింగ్ నిర్వహించారు. అయితే మెజారిటీ సభ్యులు వ్యతిరేకంగా ఓటు వేయడంతో ఓలి విశ్వాస తీర్మానం వీగిపోయింది. కాగా, గతంలో పుష్పకమల్ దహల్ (ప్రచండ) నేతృత్వంలోని కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్ మద్దతుతో కేపీ శర్మీ ఓలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే, కొన్ని నెలల క్రితం ప్రచండ పార్టీ మద్దతు ఉపసంహరించుకోవడంతో ఓలి సర్కారు మైనారిటీలో పడింది. ఈ నేపథ్యంలో ఇవాళ విశ్వాసపరీక్ష జరిగింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
భార్య కాపురానికి రానందని ముక్కు కొరికేసిన భర్త..!
కరోనా రాదంటూ కరిగించిన వెండి తాగింది.. కానీ కాటికి పోయింది..!
కరోనా ఎఫెక్ట్: తోపుడు బండిపై తల్లి అంతిమ యాత్ర..!
కరోనా పాజిటివ్గా తేలిన గంటల్లోనే యువ డాక్టర్ మృతి..!
నీరవ్ మోదీ అప్పగింత మరింత ఆలస్యం..!
నేపాల్లో 26 మంది ఎంపీలకు కరోనా..!
మాజీ డీజీపీ ప్రసాదరావు కన్నుమూత
పుదుచ్చేరి ముఖ్యమంత్రికి కరోనా పాజిటివ్