న్యూఢిల్లీ: ఇండియాలో సింగిల్ డోస్ కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించడానికి జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ సన్నద్ధమవుతోంది. ఈ మేరకు భారత ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ఆ సంస్థ ప్రతినిధి ఒకరు శుక్రవారం రాయ్టర్స్ వార్తా సంస్థకు వెల్లడించారు. ఈ సింగిల్ డోస్ కరోనా వ్యాక్సిన్ పేరు జాన్సెన్ (Janssen). అమెరికాతోపాటు యురోపియన్ యూనియన్, థాయ్లాండ్, సౌతాఫ్రికాలాంటి దేశాలు ఈ సింగిల్ డోస్ వ్యాక్సిన్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ల కొరత భయపెడుతున్న సమయంలో ఈ వార్త కాస్త ఊరట కలిగించేదే.
జాన్సన్ అండ్ జాన్సన్ అభివృద్ధి చేసిన ఈ సింగిల్ డోస్ వ్యాక్సిన్ పూర్తి సురక్షితమని, కొవిడ్పై సమర్థవంతంగా పని చేస్తోందని అమెరికా రెగ్యులేటర్ గతంలోనే చెప్పింది. యూఎస్ క్లినికల్ ట్రయల్స్లో ఈ వ్యాక్సిన్ 72 శాతం సమర్థంగా పని చేసినట్లు తేలింది. ఈ వ్యాక్సిన్ వేసుకున్న వాళ్లలో కొవిడ్తో చనిపోయిన వాళ్లు ఎవరూ లేరు. ఈ వ్యాక్సిన్ తీసుకున్న 28 రోజుల తర్వాత పూర్తి స్థాయిలో పని చేస్తోందని, తీవ్ర అస్వస్థత ప్రమాదాన్ని 85 శాతం మేర అరికట్టిందని జాన్సన్ అండ్ జాన్సన్ వెల్లడించింది. ఈ సింగిల్ డోస్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్లో 44 వేల మందికిపైగా వలంటీర్లు పాలుపంచుకున్నారు.
ప్రస్తుతం ఇండియాలో ఉన్న పరిస్థితుల్లో ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే మాత్రం అది కచ్చితంగా గేమ్ చేంజరే అవుతుందనడంలో సందేహం లేదు. సింగిల్ డోస్ వ్యాక్సిన్ అనేది ఉత్తమమైన ఆప్షన్ అని డబ్ల్యూహెచ్వో కూడా స్పష్టం చేసింది. ఇప్పటికే ఈ వ్యాక్సిన్ను ఇండియాలో తయారు చేసేందుకు బయోలాజికల్ ఇ లిమిటెడ్తో జాన్సన్ అండ్ జాన్సన్ ఒప్పందం కూడా కుదుర్చుకుంది.
ఇవి కూడా చదవండి
మా రోమియోలంటే మాకిష్టం.. యోగికి టీఎంసీ ఎంపీ కౌంటర్
ఐపీఎల్ ఓపెనింగ్ సెర్మనీకి స్పెషల్ గెస్ట్లు.. ఎవరో తెలుసా?
ముంబై vs బెంగళూరు.. తుది జట్లు ఇవే!
భయం లేదు.. రైళ్లు కొనసాగుతాయి!
యూఎస్ నేవీ దుస్సాహసం.. భారత జలాల్లో ఆపరేషన్
మహమ్మారి వెంటాడినా పెరిగిన ప్రత్యక్ష పన్ను వసూళ్లు!