కామారెడ్డి/ నిజాంసాగర్/ లింగంపేట/ గాంధారి/నాగిరెడ్డిపేట్/రామారెడ్డి/సదాశివనగర్/బీర్కూర్/ బీబీపేట్/ రాజం పేట/ ఏప్రిల్ 19: జిల్లావ్యాప్తంగా కరోనా నిర్ధారణ టెస్టులు, వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నది. లింగంపేట్ మండల కేంద్రంలోని పీహెచ్సీతోపాటు శెట్పల్లిసంగారెడ్డి, మోతె, భవానీపేట గ్రామాల్లో 158 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా.. 24 మందికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యురాలు సమీనా తెలిపారు. లింగంపేటలో ఆరు, పోల్కంపేటలో రెండు, ముంబాజీపేట తండాలో నాలుగు, నల్లమడుగు, కొండాపూర్, కొండాపూర్ తండా, కన్నాపూర్, కన్నాపూర్ తండాల్లో ఒక్కొక్కటి, మోతెలో మూడు కేసులు నమోదైనట్లు వివరించారు. ఆయా గ్రామాల్లో కొవిడ్ టీకాలు వేశామని తెలిపారు. నిజాంసాగర్ మండలంలోని మహ్మద్నగర్ గ్రామంలో జడ్పీ చైర్పర్సన్ దఫేదార్ శోభ వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఆమె వెంట జడ్పీ మాజీ చైర్మన్ దఫేదార్ రాజు, నాయకులు కాశయ్య, విజయ్, మహేందర్ వైద్యాధికారి రాధాకిషన్ ఉన్నారు. నిజాంసాగర్ పీహెచ్సీలలో 53 మందికి ర్యాపిడ్ టెస్టులు నిర్వహించగా.. 20 మందికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యాధికారి రాధాకిషన్ తెలిపారు. నిజాంసాగర్, మహ్మద్నగర్ రెండు కేంద్రాలలో 169 మందికి వ్యాక్సిన్ అందించామని తెలిపారు.
గాంధారి మండలకేంద్రంతోపాటు ఉత్తునూర్ పీహెచ్సీలో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఉత్తునూరు పీహెచ్సీలో 179 మందికి ర్యాపిడ్ టెస్టులు నిర్వహించగా.. 43 మందికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యుడు హరికృష్ణ తెలిపారు. గాంధారి దవాఖానలో 112 మందికి పరీక్షలు చేయగా.. 18 మందికి పాజిటివ్ వచ్చినట్లు తెలిపారు. ఉత్తునూరు పీహెచ్సీలో 72 మందికి, గాంధారిలో 167 మందికి, గుర్జాల్ తండాలో మొబైల్ టీం ఆధ్వర్యంలో 120 మందికి కొవిడ్ టీకాలను వేశారు.
నాగిరెడ్డిపేట్ మండలంలోని అక్కంపల్లి గ్రామంలో 82 మందికి కరోనా నిర్ధారణ టెస్టులు నిర్వహించగా.. ఐదుగురికి పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు ఎంపీపీ రాజదాస్ తెలిపారు.
రామారెడ్డి మండలం అన్నారంలో 73 మందికి టీకా ఇచ్చామని మెడికల్ ఆఫీసర్ రాము తెలిపారు. 92 మందికి కొవిడ్ టెస్టులు చేయగా.. 31 మందికి పాజిటివ్ వచ్చినట్లు చెప్పారు. రామారెడ్డి ప్రభుత్వ దవాఖానలో 55 మందికి కరోనా టీకాలు వేశామని మెడికల్ ఆఫీసర్ షాహిద్ అలీ తెలిపారు. 157 మందికి టెస్టులు చేయగా.. 39 మందికి పాజిటివ్ వచ్చినట్లు వివరించారు.
సదాశివనగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 25 పాజిటివ్ కేసులు నమోదైనట్లు డాక్టర్ ఇద్రిస్ఘోరీ తెలిపారు. 111 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 25 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యిందని తెలిపారు. సదాశివనగర్లో 15, పద్మాజివాడిలో 6, కుప్రియాల్లో 2, మోడెగామలో ఒక కేసు నమోదైనట్లు వివరించారు. 130 మందికి టీకాలను వేసినట్లు చెప్పారు.
బీర్కూర్ మండలకేంద్రంలోని పీహెచ్సీలో సోమవారం 115 పాజిటివ్ కేసులు నమోదైనట్లు మండల వైద్యాధికారి రవిరాజా తెలిపారు. 352 మందికి కరోనా టెస్టులు నిర్వహించగా.. 115 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వివరించారు.బీబీపేట్ మండలకేంద్రంలోని పీహెచ్లో 80 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా.. 13 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యిందని వైద్యులు తెలిపారు. పీహెచ్సీలో 119 మందికి కరోనా టీకా వేశామని హెచ్ఈవో శంకర్ తెలిపారు. రాజంపేట పీహెచ్సీ పరిధిలో 287 మందికి టెస్టులు చేయగా, 30 మందికి పాజిటివ్గా తేలిందని వైద్యులు తెలిపారు.
భిక్కనూరు మండలంలో 137 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 24 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యిందని వైద్యాధికారి డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు.