Gaza | హమాస్ (Hamas) అంతమే లక్ష్యంగా గత 22 నెలలుగా గాజా (Gaza) నగరంపై ఇజ్రాయెల్ (Israel) భీకర దాడులు చేస్తోంది. తాజాగా గాజా నగరంలోని పలు ప్రాంతాలపై ఐడీఎఫ్ దాడులకు తెగబడింది. నాజర్ ఆస్పత్రిపై సోమవారం జరిపిన దాడుల్లో ముగ్గురు జర్నిలిస్టులు సహా కనీసం 15 మంది ప్రాణాలు కోల్పోయినట్లు పాలస్తీనా ఆరోగ్య అధికారులు (Palestinian health officials) తెలిపారు. ప్రాణాలు కోల్పోయిన జర్నలిస్టుల్లో (journalists) ఒకరు రాయిటర్స్కు చెందిన హతేమ్ ఖలీద్, ఓ ఫొటోగ్రాఫర్ అని స్థానిక వార్తా సంస్థ తెలిపింది. 2023 అక్టోబర్ 7న మొదలైన ఈ యుద్ధంలో ఇప్పటి వరకూ గాజాలో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో మరణించిన పాలస్తీనియన్ల సంఖ్య 62 వేలు దాటింది. లక్షలాది మంది గాయపడ్డారు. ఇక ఈ యుద్ధంలో సుమారు 200 మందికిపైగా మీడియా వర్కర్స్ మరణించారు.
గాజాలో తీవ్ర కరువు
గాజాలో కరువు నెలకొన్నట్లు ఐక్య రాజ్య సమితి శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. పశ్చిమాసియాలో ఇటువంటి పరిస్థితి రావడం ఇదే తొలిసారి. ఇక్కడ 5 లక్షల మందికిపైగా ఘోరమైన ఆకలితో బాధపడుతున్నట్లు ఐరాస నిపుణులు చెప్పారు. యూఎన్ ఎయిడ్ చీఫ్ టామ్ ఫ్లెచర్ మాట్లాడుతూ, ఈ కరువు పూర్తిగా నిరోధించగలిగినదేనని చెప్పారు. ఇజ్రాయెల్ పద్ధతి ప్రకారం అడ్డంకులు సృష్టిస్తున్నందు వల్లే పాలస్తీనా భూభాగంలోకి ఆహారం వెళ్లడం లేదన్నారు. దీనిపై ఇజ్రాయెల్ విదేశాంగ శాఖ స్పందిస్తూ, గాజాలో కరువు లేదని చెప్పింది. రోమ్ నుంచి పని చేస్తున్న ఐపీసీ ప్యానెల్ విడుదల చేసిన నివేదిక హమాస్ ఉగ్రవాద సంస్థ చెప్పిన అబద్ధాల ఆధారంగా తయారు చేసినదని దుయ్యబట్టింది.
Also Read..
JD Vance | భారత్పై కావాలనే ట్రంప్ సెకండరీ టారిఫ్స్ విధించారు : జేడీ వాన్స్
యెమెన్ రాజధానిపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్