రెండ్రోజుల పర్యటనలో భాగంగా ఏఏఐ బృందం పరిశీలన
స్థల వివరాలు తెలియజేసిన సర్వే అధికారులు
ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తామన్న సభ్యులు
ఆదిలాబాద్, ఏప్రిల్ 11 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి) :ఆదిలాబాద్లో విమానాశ్రయం ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. ఉడాన్ పథకంలో భాగంగా రెండో శ్రేణి నగరాలకు విమానాలను నడిపేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఈ నేపథ్యంలో మన రాష్ట్రంలో ఆరు ప్రాంతీయ విమానాశ్రయాలను ఏర్పాటు చేయవచ్చని ప్రభుత్వం గుర్తించింది. సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయాలని ప్రభుత్వ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా కోరింది. ఇప్పటికే రెండు విడుతలుగా జిల్లాలో పర్యటించిన సభ్యులు ఆదివారం మరోసారి పరిశీలించారు. ఎయిర్పోర్టుకు అనుకూలించే పరిస్థితులు ఉన్నాయని,నివేదిక తయారు చేసి ఉన్నతాధికారులకు అందజేస్తామని వారు తెలిపారు.
తెలంగాణలో ఆరు విమానాశ్రయాల ఏర్పాటు దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం ఉడాన్ పథకంలో భాగంగా రెండో శ్రేణి నగరాల్లో ఎయిర్పోర్టులు ఏర్పాటు చేస్తుంది. ఇందులో ఆదిలాబాద్లో విమానాశ్ర యం కూడా ఉంది. సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయాలని ప్రభుత్వం ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ)ను కోరింది. ఇప్పటికే రెండువిడుతలుగా ఆదిలాబాద్లో పర్యటించిన ఏఏఐ బృందం సభ్యులు ఆదివారం మరోసారి వివిధ అంశాలను పరిశీలించారు. ఆదిలాబాద్, నిర్మల్ జి ల్లాల ప్రజలు విదేశీ పర్యటనలు, తమ బంధువుల ఇండ్ల లో శుభకార్యాలు, వ్యాపారాలు, విద్యార్థులు ఉన్నత చదువుల కోసం దూర ప్రాంతాలకు వెళ్లాలంటే విమానం ఎక్కా ల్సి ఉంటుంది. ఆదిలాబాద్తో పాటు నిర్మల్ జిల్లాకు చెంది న వారు విమానాల్లో ప్రయాణించాలంటే హైదరాబాద్ లేదా మహారాష్ట్రలోని నాగ్పూర్కు వెళ్లాల్సి ఉంటుంది. ఆదిలాబాద్ నుంచి నాగ్పూర్ 200 కిలోమీటర్లు, హైదరాబాద్ 300 కిలోమీటర్ల దూరం ఉంటుంది. దీంతో ఆదిలాబాద్ జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటు చేస్తే ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
పలు అంశాల పరిశీలన..
ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా బృందం సభ్యులు ఇప్పటికే రెండుసార్లు జిల్లాలో పర్యటించి పలు అంశాలను పరిశీలించారు. ఆదివారం ఏఏఐ అసిస్టెంట్ మేనేజర్ ఆరోవాలీ, సీనియర్ అనాలసిస్ట్లు అభిరాం, గౌరవ్ ఉపాధ్యాయ వచ్చారు. రోడ్లు భవనాలు, సర్వే అధికారులతో కలిసి ఎయిర్ఫోర్స్ మైదానాన్ని పరిశీలించారు. రన్వే దిశను, విండ్ డైరెక్షన్, విమానాలు దిగేటప్పుడు, పైకి లేచేటప్పుడు ఏమైనా అడ్డంకులు ఉన్నాయా..? అనే విషయాలను పరిశీలించారు. సర్వే అధికారుల నుంచి భూముల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఎయిర్పోర్టు స్థలం 369 ఎకరాలు ఉందని , మరో 49 ఎకరాలను సైతం గుర్తించినట్లు రోడ్లు భవనాల శాఖ డిప్యూటీ ఇంజినీర్ సురేశ్ రాథోడ్ అధికారులకు వివరించారు. విమానాశ్రయం ఏర్పాటుకు అనుకూలించే పరిస్థితులు ఉన్నాయని , రెండు రోజుల పాటు పలు విషయాలను పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదిస్తామని ఏఏఐ అధికారులు తెలిపారు. ఆదిలాబాద్ మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ విమానాశ్రయం ఏర్పాటు ఆవశ్యకతను అధికారులకు వివరించారు.
అధికారులకు వివరాలు తెలియజేశాం.
ఆదిలాబాద్ విమానాశ్రయం ఏర్పాటులో భాగంగా వచ్చిన ఎయిర్పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులకు పలు వివరాలను తెలియజేశాం. ఎయిర్పోర్టు కోసం గతంలో తాము సేకరించిన సమాచారంతో పాటు భూ ములు, ఇతర అంశాలను వివరించాం. ఈ రోజు వారు పలు అంశాలను పరిశీలిస్తారు.
ఇవి కూడా చదవండి
దక్షిణాది అవకాశాలువస్తున్నాయి!