Traffic Restrictions | హైదరాబాద్ : ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో గురువారం సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య ఐపీఎల్ మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు రాచకొండ సీపీ తరుణ్ జోషి తెలిపారు.
సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11.50 వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు. బోడుప్పల్, చెంగిచర్ల, పీర్జాదిగూడ నుంచి ఉప్పల్ వైపు వచ్చే భారీ వాహనాలు భాగయత్ లే అవుట్ నుంచి నాగోల్ వైపు, ఎల్బీనగర్ వైపు నుంచి ఉప్పల్ వైపు వచ్చే వాహనాలు హెచ్ఎండీఏ లే అవుట్ నుంచి బోడుప్పల్, చెంగిచర్ల ఎక్స్ రోడ్డు వైపు.. తార్నాక వైపు నుంచి ఉప్పల్ వైపు వచ్చే వాహనాలు నాచారం, చర్లపల్లి వైపు నుంచి రాకపోకలు సాగించాలని సూచించారు.