పబ్లు, బార్లు, స్టార్హోటళ్లలో మద్యం తాగినవారిని క్షేమంగా ఇంటికి చేర్చాలని సైబరాబాద్ సీపీ సజ్జనార్ వాటి నిర్వాహకులకు సూచించారు. ఈ మేరకు శనివారం డ్రంక్ అండ్ డ్రైవింగ్ వల్ల చోటుచేసుకుంటున్న రోడ్డు ప్రమాదాలు, మరణాలను ఆపేందుకు బార్ అండ్ రెస్టారెంట్లు, పబ్లు, స్టార్హోటళ్లు, వైన్స్ నిర్వాహకులతో శనివారం సమన్వయ స మావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. పబ్లు, బార్లు, హోటళ్లలో మద్యం తాగినవారిని వాహనాలు నడపకుండా చూడాలని.. డ్రైవర్లను ఏర్పాటు చేసి క్షేమంగా వారు ఇంటికి వెళ్లేలా ఏర్పాట్లు చేయాలని నిర్వాహకులకు సూచించారు. వారు వినకపోతే డయల్ 100కు ఫోన్ చేయాలన్నారు. ప్రతి ఎంట్రీ.. ఎగ్జిట్ వద్ద బోర్డులు పెట్టి మద్యం సేవించి వాహనం నడపడం నేరమని అవగాహన కల్పించాలన్నారు.. సీసీ కెమెరాలను తప్పక ఏర్పాటు చేయాలని.. ముఖ్యంగా పార్కింగ్ వద్ద కూడా ప్రత్యేకంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు. స మావేశంలో ట్రాఫిక్ డీసీపీ విజయ్కుమార్, మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు, మియాపూర్, మాదాపూర్ ఏసీపీలు కృష్ణ ప్రసాద్, రఘునందన్రావు, ట్రాఫిక్ ఏసీపీ చంద్రశేఖర్, నిర్వాహకులు పాల్గొన్నారు.