జోగులాంబ గద్వాల : ఆత్మహత్య చేసుకున్న డ్రైవర్ శంకర్ గౌడ్ ( RTC Driver Shanker Goud ) కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, ఆయన మృతికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలని నియోజకవర్గ బీఆర్ఎస్ ( BRS ) పార్టీ ఇన్చార్జి బాసు హనుమంతు నాయుడు ( Hanmanth Naidu ) డిమాండ్ చేశారు.
గద్వాల జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ఆయన మద్దతు తెలిపారు. ఆర్టీసీ కార్మికులు ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని కోరారు. ఈ సందర్భంగా శంకర్ గౌడ్ చిత్రపటానికి పూలమాలవేసి, శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సాధనలో ఆర్టీసీ కార్మికుల పాత్ర మరువలేనిదని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు రెండున్నరేండ్లు అవుతున్నా, అప్పటి నుంచి తమ సమస్యలు పరిషరించాలని ఆర్టీసీ కార్మికులు వేడుకుంటున్నా ప్రభుత్వం మొండివైఖరినీ అవలంభిస్తుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో నాగర్ దొడ్డి వెంకట్రాములు, వెంకటేశ్వర రెడ్డి, బీచుపల్లి, కౌన్సిలర్లు పులిపాటి వెంకటేష్,గువ్వల గోపాల్,చిత్తరి కిరణ్, మోహన్ యాదవ్, కమ్మరి రాము, గంజిపేట రాజు, కురవ పల్లయ్య, పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.