Red Sea | యెమెన్ (Yemen)లోని హౌతీ (Houthis) తిరుగుబాటుదారులు నానాటికీ రెచ్చిపోతున్నారు. ఎర్ర సముద్రం (Red Sea) మీదుగా రాకపోకలు సాగించే వాణిజ్య నౌకలే లక్ష్యంగా దాడులకు తెగబడుతున్నారు. ఎన్ని హెచ్చరికలు చేసినా దాడులు మాత్రం ఆపడం లేదు. తాజాగా మరోసారి దాడికి పాల్పడ్డారు.
అగ్రరాజ్యం అమెరికాకు చెందిన రెండు నౌకలపై (two US warships) మంగళవారం డ్రోన్లతో దాడి (Drone Attacks) చేశారు. రెడ్ సీలో యూఎస్కు చెందిన రెండు నౌకలపై దాడి చేసినట్లు హౌతీ మిలిటరీ గ్రూప్ స్పోక్స్పర్సన్ యహ్యా సరెయ తెలిపారు. నావికాదళ క్షిపణులు, డ్రోన్ల (naval missiles drones) సాయంతో రెండు యూఎస్ వార్షిప్ డిస్ట్రాయర్లపై దాడులు చేసినట్లు ఓ టెలివిజన్ ఛానల్తో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు.
Also Read..
Bunkers | బంకర్లు కడుతున్న బిలియనీర్లు.. హవాయి దీవుల్లో జుకర్బర్గ్ బంకర్
DMK MP Raja | భరతమాతను ఆమోదించం.. డీఎంకే ఎంపీ రాజా వివాదాస్పద వ్యాఖ్యలు