కాబూల్ : ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ గుప్పిట్లో ఉన్నది. ఇంకా అక్కడ ప్రభుత్వం ఏర్పడలేదు. గతంలోని ప్రభుత్వానికి, అమెరికా సేనలకు మద్దతుగా నిలిచిన ఎన్నో కుటుంబాలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని దేశం దాటేందుకు తీవ్రంగా యత్నిస్తున్నారు. ఉన్నవారు కూడా ఇళ్లు వదిలి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. ఇక మహిళల (Afghan Women) పరిస్థితి చెప్పరాని విధంగా ఉన్నది. ఇప్పటికీ మగవారు లేనిదే మహిళలు బయటకు రాకూడదని ఫత్వా కూడా జారీ చేశారు. ఇలాఉండగా, కాబూల్ను తాలిబాన్ తమ ఆధీనంలోకి తీసుకున్న మూడో రోజునే ఓ ఐదుగురు మహిళలు ప్రాణాలకు తెగించి హక్కుల కోసం గళమెత్తారు. వీరి ధైర్యసాహసాలు ప్రస్తుతం అంతటా చర్చనీయాంశంగా మారింది.
గత 20 ఏండ్ల క్రితం తమకు దక్కిన హక్కులు తమకు కావాలంటూ ఐదుగురు మహిళలు ఆందోళనకు పూనుకున్నారు. చేతుల్లో ప్ల కార్డులు పట్టుకుని ప్రధాన వీధిలో నిల్చుని నినాదాలు చేశారు. అలాగే, రాజకీయాల్లో కూడా పాల్గొనే హక్కును అమలు చేయాలంటూ వారు నినదించారు. రాజ్యాంగం ప్రకారం తమకు దక్కిన హక్కులను ఇక్కడి మహిళలు అనుభవిస్తారని, ఆఫ్ఘానిస్తాన్ మహిళల్ని ఎప్పుడూ విస్మరించలేదని వారు చెప్పారు. ఏ అధికారం కూడా తమ గొంతులను నొక్కలేదని, 20 ఏండ్ల క్రితం మహిళలకు దక్కిన హక్కుల కోసం పోరాటం కొనసాగుతుందని వారు చెప్పడం విశేషం.
ఇలాఉండగా, మహిళలతోపాటు మీడియాకు కూడా స్వేచ్ఛ ఇస్తున్నట్లు తాలిబాన్ ప్రతినిధులు మంగళవారం ప్రకటించారు. ప్రభుత్వంలో కూడా మహిళలు చేరాలని తాలిబాన్ పిలుపునిచ్చింది. షరియా చట్టం కింద మహిళలు హక్కులు పొందుతారని, బుర్ఖా ధరించి చదువుకునేందుకు, పని చేసేందుకు అనుమతిస్తామని తాలిబాన్ వెల్లడించింది.
నేతాజీ… గగన సిగలకెగసి కనుమరుగై పోయాడు..
ట్విట్టర్ బర్డ్ ఫ్రై.. ఎందుకు చేశారంటే..?
వారు అధికారంలోకొచ్చారు.. మహిళా మోడల్స్పై సున్నమేశారు..!