తాండూర్ : సమాజ శ్రేయస్సు కోసం హిందువులు ( Hindus ) ఏకతాటిపై నడవాలని ఆదిలాబాద్ శ్రీరామచంద్ర గోపాలకృష్ణ మఠం మఠాధిపతి యోగానంద సరస్వతి ( Yogananda Saraswati ) పేర్కొన్నారు. శనివారం తాండూర్ మండల కేంద్రంలో హిందూ సమ్మేళనంలో ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు.
పురాణాలు, ఇతిహాసాలు, సంప్రదాయాల ప్రభావంతో సనాతన ధర్మం ప్రారంభమైంద న్నారు. ఈ సనాతన ధర్మం ప్రతి రూపమే హిందూ సమ్మేళనమని అన్నారు. ముఖ్యంగా సనాతన ధర్మం పాటించినప్పుడే సమాజం బాగుంటుందన్నారు. హిందూ అనేది మతం కాదని, హిందూ ధర్మం ఒక జీవన విధానమని పేర్కొన్నారు.
హైందవ ధర్మ పరిరక్షణకు ప్రజలంతా భక్తి భావంతో దేశం కోసం, ధర్మం కోసం కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల సహప్రాంత సద్భావన ప్రముఖ్ గోనె భూమయ్య,కార్యవాహిక పొన్నవేని లక్ష్మి, హిందూ సమ్మేళన సమితి తాండూర్ మండల కమిటీ అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు మద్దికుంట రామచందర్, దేవరకొండ రాజన్న తదితరులు పాల్గొన్నారు.