Earthquake | ఇండోనేషియా (Indonesia)ను భూకంపం (Earthquake) కుదిపేసింది. ప్రధాన ద్వీపమైన జావా (Java island)తోపాటు రాజధాని జకర్తా (jakarta)లో ఆదివారం రాత్రి బలమైన భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. భూకంపం తీవ్రత రిక్టరు స్కేలుపై 5.6గా నమోదైనట్లు అమెరికా జియోలాజికల్ సర్వే ( U.S. Geological Survey) తెలిపింది.
భూ ఉపరితలం నుంచి 37.2 కిలోమీటర్ల దిగువన భూకంపం చోటుచేసుకున్నట్లు తెలిపింది. భూకంప కేంద్రం పశ్చిమ జావా ప్రావిన్స్లోని తీరప్రాంత పట్టణమైన పెలబుహన్రాటుకు పశ్చిమ-నైరుతి దిశలో 80 కిలోమీటర్లు (29 మైళ్ల) దూరంలో గుర్తించినట్లు పేర్కొంది. అయితే, ఆస్తినష్టం, ప్రాణ నష్టం గురించి సమాచారం ఏదీ ఇప్పటి వరకూ అందలేదు.
ప్రస్తుతానికి సునామీ వంటి ప్రమాదం ఏదీ లేదని, అయితే ప్రకంపనలు పెరిగే అవకాశాలు లేకపోలేదని అధికారులు వెల్లడించారు. ఈ భూకంపం ధాటికి రాజధాని నగరం జకర్తాలో ఎత్తైన భవనాలు కొన్ని సెకన్లపాటు ఊగిపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
Also Read..
Abdulla Shahid | వారి విషయంలో ముయిజ్జువి అన్నీ అబద్ధాలే: మాల్దీవుల మాజీ మంత్రి అబ్దుల్లా
Arvind Kejriwal | ఈడీ విచారణకు కేజ్రీవాల్ ఏడో సారీ డుమ్మా.. ఈ వ్యవహారం కోర్టులో ఉందన్న ఆప్
Congress | పెత్తనం ఎవరిది.. నిజామాబాద్లో రసకందాయంగా మారుతున్న హస్తం రాజకీయం