ఇస్లామాబాద్ : (Pakistan Bank) పాకిస్తాన్లోని రెండో అతిపెద్ద బ్యాంకులోకి హ్యాకర్లు చొరబడ్డారు. నేషనల్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ (ఎన్బీపీ)పై సైబర్ దాడి జరిగింది. ఈ విషయాన్ని పాకిస్తాన్ స్టేట్ బ్యాంక్ ట్విట్టర్లో వెల్లడించింది. సైబర్ దాడి జరిగిన మాట వాస్తవమే అని, అయితే డబ్బు, డాటా రెండూ సురక్షితంగా ఉన్నాయని ఎన్బీపీ ఒక ప్రకటనలో తెలిపింది. సైబర్ దాడి అనంతరం బ్యాంకుకు సంబంధించి కొన్ని రకాల సేవలను నిలిపివేసినట్లు బ్యాంక్ వెల్లడించింది. సైబర్ సెక్యూరిటీకి సంబంధించి కేసు నమోదు చేసుకుని సైబర్ సెల్ పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. సైబర్ దాడి ఘటన జరిగినట్లు మరే ఇతర బ్యాంకు పేర్కొనలేదని ఎన్బీపీ తెలిపింది.
బ్యాంకింగ్ వ్యవస్థ సక్రమంగా పని చేస్తుందీ, లేనిదీ పరిశీలిస్తున్నట్లు బ్యాంక్ అధికారులు తెలిపారు. అక్టోబరు 30 తెల్లవారుజామున బ్యాంక్ సర్వర్లపై సైబర్ దాడి జరిగినట్లు గుర్తించినట్లు నేషనల్ బ్యాంక్ పేర్కొన్నది. 40-50 మంది స్థానిక, అంతర్జాతీయ నిపుణులు వ్యవస్థను ప్రమాదం నుంచి బయటికి తీశారు. మైక్రోసాఫ్ట్తో పాటు మూడు ప్రొఫెషనల్ కంపెనీలు సోమవారం నాటికి బ్యాంక్ సేవలను తిరిగి ప్రారంభించేందుకు కృషి చేస్తున్నాయని ఎన్బీపీ ప్రెసిడెంట్ ఆరిఫ్ ఉస్మానీ తెలిపారు. సోమవారం నాటికి బ్యాంకు సేవలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ప్రభుత్వం తరపున ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతినెలా 1వ తేదీన జీతాలు ఈ బ్యాంకు నుంచే అందిస్తున్నారు.
ఇలా చేయడం అంటే.. మోదీ మళ్లీ రోమ్కు వెళ్తాననడమే..!
నీరజ్ చోప్రాకు చెన్నై సూపర్ కింగ్స్ స్పెషల్ జెర్సీ
త్వరలో భారత్ నుంచి ఎలోన్ మస్క్ సంస్థకు సరికొత్త సవాల్
శీతాకాలంలో గుండెపోటును ఇలా నివారించండి
తొలిసారి ప్రపంచం ముందుకొచ్చిన తాలిబాన్ అగ్రనేత అఖుంద్జాదా
వెంకన్నను దర్శించుకున్న అనిల్ అంబానీ దంపతులు
ఏపీ డిప్యూటీ సీఎంకు ఊహించని షాక్
ఊరికో గ్రంథాలయం, ఇంటికో స్వచ్ఛాలయం నినాదం కావాలి : వెంకయ్యనాయుడు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..