Anand Mahindra | వాళ్లిద్దరూ ప్రపంచంలోనే అపర కుబేరులు.. ఒకరు నంబర్వన్ ప్లేస్లో ఉన్న ఎలాన్ మస్క్ అయితే.. ఇంకొకరు రెండో ప్లేస్లో ఉన్న బెర్నాండ్ ఆర్నాల్ట్. ఆ ఇద్దరూ కలిసి పారిస్లో ఒక రెస్టారెంట్లో లంచ్కు వెళ్లారు. సకుటుంబ సపరివార సమేతంగా విందు చేశారు. ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. అత్యంత ఐశ్వరులైన ఆ ఇద్దరూ లంచ్ చేసిన విషయాన్ని కాసేపు పక్కనబెడితే.. ఇంతకీ వాళ్లిద్దరిలో రెస్టారెంట్ బిల్లు ఎవరు కట్టి ఉంటారు? ఆలోచిస్తుంటే మీకూ ఈ సందేహం వస్తుంది కదూ.. మనకే కాదు మహీంద్రా సంస్థల అధినేత అయిన ఆనంద్ మహీంద్రా సతీమణికి కూడా సేమ్ ఇదే డౌన్ వచ్చిందంట. కానీ తనకు కూడా సమాధానం తెలియకపోవడంతో ట్విట్టర్ వేదికగా ఎలన్ మస్క్నే ఈ విషయాన్ని అడిగేశాడు. దీనికి సంబంధించిన ట్వీట్ ఇప్పుడు వైరల్ మారింది.
My wife was wondering who paid for the lunch…@elonmusk https://t.co/NIsPR4o9Oj
— anand mahindra (@anandmahindra) June 18, 2023
ఆనంద్ మహీంద్రా చేసిన ఈ ట్వీట్కు నెటిజన్లు కూడా ఫన్నీగా స్పందిస్తున్నారు. బిల్లు కట్టాల్సిన ఖర్మ వాళ్లకేంటి? లంచ్కు వెళ్లడానికి ముందే ఆ రెస్టారెంట్ను కొనేసి ఉంటారని కామెంట్లు పెడుతున్నారు. పైసా ఖర్చు లేకుండా రెస్టారెంట్కు ప్రచారం జరిగింది కాబట్టి యాజమాన్యమే అపర కుబేరులకు డబ్బులు చెల్లించాలని అంటున్నారు. మరి దీనిపై మస్క్ ఎలా స్పందిస్తాడో చూడాలి.
టెస్లా, స్పేస్ఎక్స్ సంస్థల సీఈవో ఎలన్ మస్క్ తన తల్లి మేయి మస్క్తో లంచ్కు రాగా, లూయిస్ విట్టాన్ సీఈవో బెర్నార్డ్ తన ఇద్దరు కుమారులు ఆంటోయిన్, అలెగ్జాండర్ అర్నాల్ట్తో కలిసి విందుకు హాజరయ్యారు. ఇక ఫోర్బ్స్ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం మస్క్ సంపద 236 బిలియన్ డాలర్లు కాగా.. బెర్నాల్డ్ సంపద 233 బిలియన్ డాలర్లు.
Ireland | మా దేశం వస్తే 71 లక్షలు ఇస్తాం.. యూరప్ కంట్రీ బంపరాఫర్.. అదొక్కటే కండీషన్ !
Extramarital Affiar | వివాహేతర సంబంధం పెట్టుకున్నారా.. అయితే మీ ఉద్యోగం హుష్ కాకే!