కామారెడ్డి : కామారెడ్డి జిల్లా కాంగ్రెస్లో(Congress )వర్గ విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ కలిసికట్టుగా ముందుకెళ్లాల్సిన సమయంలో నాయకులు ఎవరికి వారే అన్నట్లు వ్యవహరిస్తుండటంతో క్యాడర్లో అయోమయం నెలకొంది. తాజాగా బాన్సువాడలో జిల్లా కాంగ్రెస్ నేతలు ఏనుగు రవీందర్ రెడ్డి(Ravinder Reddy), అంబర్ సింగ్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. చందూరు ఎన్నికల కమిటీ వేషయంలో ఇద్దరు నేతలు గొడవపడ్డారు.
పార్టీ కమిటీ ఏర్పాట్లపై సమాచాం ఇవ్వకపోవడంతో అంబర్ సింగ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. నేతలిద్దరూ పరస్పరం తొసేసుకున్నారు. పార్టీ కార్యకర్తలు వారిని సముదాయించే ప్రయత్నం చేశారు. ఐక్యంగా లేకుండా ఇలాగే ముందుకెళ్తే ఎన్నికల్లో గెలవడం కష్టమేనని ఆ పార్టీ నేతలే చర్చించుకోవడం గమనార్హం. అసలే బలహీనంగా పార్టీ ఇంటి గొడవలతో మరింత బలహీనమవడం ఖాయమని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.