Earthquake | పొరుగుదేశం పాకిస్థాన్ (Pakistan)లో భూకంపం (Earthquake) సంభవించింది. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 5.8గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (National Center for Seismology) వెల్లడించింది. పాక్ రాజధాని ఇస్లామాబాద్ సమీపంలో శనివారం మధ్యాహ్నం 1 గంట (స్థానిక కాలమానం ప్రకారం) సమయంలో భూ ప్రకంపనలు నమోదైనట్లు తెలిపింది.
భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రాన్ని గుర్తించినట్లు పేర్కొంది. ఈ భూ ప్రకంపనలతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇళ్లు, కార్యాలయాల నుంచి బయటకు పరుగులు తీశారు. ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదు. ఈ భూకంపం ధాటికి జమ్ముకశ్మీర్లోనూ భూమి కంపించింది.
An earthquake of magnitude 5.8 on the Richter scale hit Pakistan at 1:00 PM (IST): National Center for Seismology pic.twitter.com/J4X2P28f9I
— ANI (@ANI) April 12, 2025
ఇవాళ ఉదయం పసిఫిక్ మహాసముద్రంలోని ద్వీప దేశమైన పపువా న్యూ గునియాలో (Papua New Guinea) భారీ భూకంపం (Earthquake) సంభవించిన విషయం తెలిసిందే. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 6.2గా నమోదైనట్లు అమెరికా జియోలాజికల్ సర్వే (US Geological Survey) తెలిపింది. కోకోపో (Kokopo) పట్టణానికి ఆగ్నేయంగా 115 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించినట్లు పేర్కొంది. 72 కిలోమీటర్ల (44 మైళ్ల) లోతులో భూకంపం కేంద్రం ఉన్నట్లు తెలిపింది. ప్రస్తుతం అక్కడ సునామీ హెచ్చరికలు ఏమీ జారీ చేయలేదు.
Also Read..
Earthquake | పపువా న్యూ గునియాలో భారీ భూకంపం.. వారంలో రెండోసారి
Waqf Act | బెంగాల్లో వక్ఫ్ నిరసనలు హింసాత్మకం.. 110 మంది అరెస్ట్
Terror attacks | దేశంలో ఉగ్రవాదులు దాడి చేయొచ్చు.. ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరిక