వాషింగ్టన్ : రష్యాన్ దౌత్తవేత్తలను తమ దేశం విడిచి వెళ్లిపోవాల్సిందిగా అమెరికా హుకూం జారీ చేసింది. 24 మంది రష్యాకు చెందిన దౌత్యవేత్తలు వచ్చే నెల 3 వ తేదీ లోపు దేశం విడిచి వెళ్లాలని అమెరికా (America order) ఆదేశించింది. వీసా గడువు ముగిసినందున వీరిని దేశం విడిచి వెళ్లాలని ఆదేశించినట్లు అమెరికా కారణాలు వెల్లడించింది. ఈ విషయాన్ని అమెరికాలోని రష్యన్ అంబాసిడర్ అనాటోలీ ఆంటోనోవ్ ధ్రువీకరించారు. తమ దేశ దౌత్యవేత్తల వీసాల గడువు ముగిసినందున వారికి ఆర్డర్ ఇవ్వబడిందని, వీరందరూ సెప్టెంబర్ 3 నాటికి అమెరికా విడిచి వెళ్లిపోవాలని ఆదేశాలు అందినట్లు ఆయన వెల్లడించారు.
రష్యా రాయబారి అనటోలీని ఉటంకిస్తూ, వీసా జారీ ప్రక్రియలను అమెరికా కఠినతరం చేయడంతో దాదాపు అందరు దౌత్యవేత్తలు అమెరికాను వదిలి వెళ్లిపోతారని జిన్హువా వార్తా సంస్థ పేర్కొన్నది. అమెరికా నుంచి వీసాలు పొందే అవకాశం లేకపోవడంతో.. ఈ దౌత్యవేత్తల స్థానంలో ఇతర దౌత్యవేత్తలు కూడా రష్యా రాయబార కార్యాలయంలో నియమించబడరని తెలుస్తున్నది. 2020 డిసెంబర్లో అమెరికా-రష్యా మధ్య కుదిరిన ఒప్పందం మేరకు రష్యా దౌత్యవేత్తలు మూడేండ్లపాటు అమెరికాలో ఉండాలి. వీసా గడువు ముగిసిన తర్వాత ఎవరైనా దేశం విడిచి వెళ్లిపోవడం లేదా వీసా పొడిగింపు కోసం దరఖాస్తు చేసుకోవాలి.
‘నాకు తెలిసినంత వరకు ఈ నియమం మరే ఇతర దేశానికి వర్తించదు’ అని వాషింగ్టన్ మ్యాగజైన్ ‘ది నేషనల్ ఇంటరెస్ట్’ తో జరిపిన సంభాషణలో అనాటోలీ ఆంటోనోవ్ చెప్పడం విశేషం. ఈ నేపథ్యంలో, అనటోలీ వ్యాఖ్యలపై యూఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ ప్రతినిధి నెడ్ ప్రైస్ స్పందిస్తూ.. ‘రష్యన్లకు వీసాల చెల్లుబాటుపై మూడేండ్ల పరిమితి కొత్తదేమీ కాదు’ అని అన్నారు. తమ దేశ పౌరులను నియమించకుండా అమెరికాతో దౌత్య కార్యకలాపాలను పూర్తిగా నిషేధిస్తున్నట్లు ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ఏప్రిల్లో రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఎన్నికల్లో జోక్యం చేసుకున్నారన్న ఆరోపణలతోపాటు సైబర్ దాడుల్లో రష్యా ప్రమేయంపై జో బైడెన్ ప్రభుత్వం ఏప్రిల్ 15 న 10 మంది రష్యా దౌత్యవేత్తలను బహిష్కరించిన విషయం తెలిసిందే.
పీవీ సింధు ఈ కులమేనా..? ఇంటర్నెట్లో జోరుగా సెర్చింగ్
తొలిసారి ఇంట్లోకొచ్చిన కంప్యూటర్ టీఆర్ఎస్-80
దోమల జనాభా నియంత్రణ ద్వారా మలేరియాకు చెక్!
కరోనా వ్యాక్సిన్తో క్యాన్సర్కు అడ్డుకట్ట
ఇక్కడ ముద్దులు నిషేధం.. ముంబైలో స్పెషల్ జోన్
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..