కాబూల్ : ఆఫ్ఘనిస్తాన్ను తాలిబాన్ తమ గుప్పిట్లోకి తీసుకున్న అనంతరం పరిస్థితులు మెల్లమెల్లగా మారుతున్నాయి. ముఖ్యంగా మహిళల (Women Disappear) భద్రత పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నది. గతంలో ఎన్నో అనుభవాలను చూసిన మహిళలు.. ప్రస్తుతం బయటకు వచ్చేందుకు కూడా జంకుతున్నారు. ఇప్పటివరకు బహిరంగంగా రోడ్లపై తిరిగిన మహిళలపై తాలిబాన్ బ్రాండ్ పడనున్నది. ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ను హస్తగతం చేసుకున్న క్షణాల్లోనే మహిళల కటౌట్లు, యాడ్ ఫొటోలపై దృష్టి సారించినట్లుగా తెలుస్తున్నది.
కాబూల్లోని ఓ మహిళా క్షౌరశాల వద్ద ఏర్పాటుచేసిన మహిళా మోడల్స్ ఫొటోలపై సున్నం వేసి చెరిపేస్తున్న దృశ్యాన్ని ఆఫ్ఘాన్కు చెందిన ఫొటో జర్నలిస్ట్ లోత్ఫుల్లా నజాఫిజాదా బయటి ప్రపంచానికి చాటేందుకు ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అనంతరం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆఫ్ఘనిస్తాన్లో ‘మహిళల తొలగింపు’ అంటూ పోస్ట్ చేసిన ఈ ఫొటోపై పలువురు నెటిజెన్లు తీవ్రంగా కామెంట్లు చేస్తూ తమ ఆవేదనను వెలిబుచ్చారు. వాయవ్య ఫారియాబ్ ప్రావిన్స్లోని అనేక ప్రాంతాల్లో మగ తోడు లేకుండా వచ్చిన మహిళలు ఎలాంటి వస్తువులను విక్రయించవద్దని తాలిబాన్ హెచ్చిరించింది.
1996-2001 మధ్య ఆఫ్ఘనిస్తాన్ను పాలించిన సమయంలో తాలిబాన్ కఠినమైన ఇస్లామిక్ చట్టాన్ని విధించింది. మహిళలు పనులు చేయడం, చదువుకోవడంపై నిషేధం విధించారు. మహిళల హక్కులు రక్షిస్తామని తాలిబాన్ పదేపదే పేర్కొంటున్నప్పటికీ.. అణచివేత నియమాలు తిరిగి వస్తున్నట్లుగా తెలుస్తున్నది. ‘పోరాటయోధులతో’ వివాహం కోసం 15 ఏండ్ల వయసు పైబడిన బాలికలు, 45 సంవత్సరాల కంటే తక్కువ వయస్సున్న వితంతువుల జాబితాను అందించాలని తాలిబాన్ ఆఫ్ఘన్లను ఆదేశించినట్లు పలు నివేదికలు చెప్తున్నాయి.
ఉత్తరాఖండ్ సీఎం అభ్యర్థిని ప్రకటించిన ఆప్
మలేషియా ప్రధానిగా యాసిన్ రాజీనామా
లాహోర్ను పాకిస్తాన్కిచ్చిన రాడ్క్లిఫ్
మహిళలకు ఐఆర్సీటీసీ ‘రక్షాబంధన్’ కానుక