ఎదులాపురం, మే 10 : భాష, ప్రాంతాలు వేరైనా ప్రేమకు హద్దులు లేవని నిరూపించారు ఆదిలాబాద్ అబ్బాయి, లండన్ అమ్మాయి. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కృష్ణానగర్కు చెందిన భూశెట్టి మహేందర్ భారతీల కుమారుడు భూశెట్టి సాయిచరణ్ పదేళ్ల క్రితం లండన్కు ఉన్నత చదువుల కోసం వెళ్లి అకడే వ్యాపారంలో స్థిరపడ్డారు. అదే సమయంలో లండన్లోని కార్డిప్ చెందిన కిమ్ హెనోచ్-గారెత్ హెనోచ్ల కూతురు మియామేతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది.
ఐదేళ్లుగా ప్రేమలో ఉన్న సాయిచరణ్-మియామే పెద్దలను ఒప్పించి మూడు ముళ్లతో ఒకటవ్వాలని అనుకున్నారు. ఇరు కుటుంబాలు ఒప్పుకోవడంతో మే 10న జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో మూడు ముళ్లతో ఒకటయ్యారు. గత నెల ఇద్దరు కలిసి భారతదేశానికి వచ్చి ఇకడి సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. వివాహ బంధంతో ఒకటయ్యారు.