పోర్ట్ మోర్స్బే: పసిఫిక్ మహాసముద్రంలోని ద్వీపదేశమైన పపువా న్యూగినియాలో (Papua New Guinea) భారీ భూకంపం (Earthquake) వచ్చింది. దీనితీవ్రత 7.0గా నమోదయిందిన యూఎస్ జియోలాజికల్ సర్వే (USGS) వెల్లడించింది. సోమవారం ఉదయం 4 గంటల సమయంలో సముద్ర తీరంలోని వెవాక్ (Wewak) పట్టణానికి 97 కిలోమీటర్ల దూరంలో ప్రకంపణలు చోటుచేసుకున్నాయని తెలిపింది. భూఅంతర్భాగంలో 62 కిలోమీటర్ల లోతులో భూమి కంపించిందని పేర్కొన్నది. కాగా, భారీ భూకంపం సంభవించినప్పటికీ సునామీ (Tsunami ) వచ్చే ప్రమాదమేమీ లేదని చెప్పింది. భూకంప సంభవించిన ప్రాంతంలో పెద్దఎత్తున నష్టం వాటిళ్లినట్లు తెలిపింది. భూకంపం సంభవించిన ప్రాంతం ఇండోనేషియా (Indonesia) సరిహద్దుకు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నదని వెల్లడించింది.
ఈ ఏడాది ఫిబ్రవరి 23న న్యూగినియాలోని కండ్రియాన్లో (Kandrian) భూమి కంపించింది. దీని తీవ్రత 6.2గా నమోదయిందని యూఎస్జీఎస్ తెలిపింది. భూఅంతర్భాగంలో 38.2 కిలోమీటర్ల లోతులో కంపించిందని వెల్లడించింది. కాగా, సోమవారం తెల్లవారుజామున 1.12 గంటలకు టిబెట్లోని (Tibet) స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ప్రాంతమైన జిజాంగ్లో (Xizang) భూమి కంపించింది. దీని తీవ్రత 4.2గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) తెలిపింది.
An earthquake with a magnitude of 4.2 on the Richter Scale hit Xizang, Tibet at around 01:12 am: National Centre for Seismology pic.twitter.com/BzEkKvHqpM
— ANI (@ANI) April 2, 2023