Earthquake : జపాన్లో బుధవారం రాత్రి భూమి తీవ్రంగా కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 6.4గా నమోదైంది. అయితే అధికారులు ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ చేయకపోవడంతో ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు.
దక్షిణ జపాన్లోని నాన్యో ప్రాంతంలో భూ ప్రకంపనలు సంభవించాయని జపాన్ మెటరాలజికల్ ఏజెన్సీ (జేఎంఏ) వెల్లడించింది. జపాన్ ద్వీపాలు కైకూ, షికోకులను వేరు చేసే బుంగో చానల్ భూకంప కేంద్రంగా జేఎంఏ వెల్లడించింది.
భూప్రకంపనలతో ఎలాంటి భారీ నష్టం వాటిల్లిన వివరాలు వెల్లడికాలేదు. ఇకట న్యూక్లియర్ ప్లాంట్లో ఆ సమయంలో ఒక రియాక్టర్ పనిచేస్తున్నా దానిపై ఎలాంటి ప్రభావం లేదని షికోకు ఎలక్ట్రిక్ పవర్ తెలిపింది.
Read More :
Dubai | ఎడారి దేశాన్ని ముంచెత్తిన భారీ వర్షం.. భారత్-దుబాయ్ మధ్య నడిచే 28 విమానాలు రద్దు