Gulf Of Aden | యెమెన్ (Yemen)లోని హౌతీ (Houthis) తిరుగుబాటుదారులు నానాటికీ రెచ్చిపోతున్నారు. హమాస్-ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతున్న క్రమంలో హమాస్కు మద్దతుగా ఎర్ర సముద్రం (Red Sea) మీదుగా రాకపోకలు సాగించే వాణిజ్య నౌకలే లక్ష్యంగా దాడులకు తెగబడుతున్నారు. ఈ దాడుల్లో ఇప్పటి వరకూ నౌకలకే నష్టం వాటిల్లింది. అయితే, హౌతీ రెబల్స్ జరుపుతున్న దాడుల్లో తొలిసారిగా మరణాలు సంభవించాయి.
గ్రీస్ యాజమాన్యానికి చెందిన ‘ట్రూ కాన్ఫిడెన్స్’ (True Confidence) కార్గో నౌక బార్బడోస్ జెండా (Barbados-flagged)తో చైనా నుంచి సౌదీ అరేబియాలోని జెడ్డాకు వెళ్తోంది. ఆ నౌకపై గల్ఫ్ ఆఫ్ ఎడెన్ (Gulf Of Aden)లో హౌతీ తిరుగుబాటుదారులు క్షిపణులతో దాడి చేశారు (Missile Hits). ఈ దాడిలో కార్గో నౌక తీవ్రంగా దెబ్బతినింది. ఈ ఘటనలో ముగ్గరు సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు గాయపడినట్లు అమెరికా అధికారులు ధ్రువీకరించారు.
ఘటన జరిగిన సమయంలో నౌకలో సుమారు 20 మంది సిబ్బంది, ముగ్గురు సాయుధ గార్డులు ఉన్నట్లు తెలిసింది. వారిలో భారత్కు చెందిన ఒకరు, వియత్నాంకు చెందిన నలుగురు, ఫిలిప్పీన్స్కు చెందిన 15 మంది సిబ్బంది ఉన్నట్లు నౌక యాజమాన్యం తెలిపింది. యెమెన్ నగరం ఎడెన్కు 90 కిలోమీటర్ల దూరంలో
ఈ దాడి జరిగినట్లు పేర్కొంది.
Also Read..
Mass Shooting: ఫిలడెల్ఫయాలో కాల్పుల ఘటన.. ఏడుగురికి గాయాలు
Ravichandran Ashwin | అశ్విన్కు వందో టెస్టు.. టీమిండియా ‘గార్డ్ ఆఫ్ ఆనర్’.. వీడియో
PM Modi: కాసేపట్లో శ్రీనగర్కు ప్రధాని మోదీ .. ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలి పర్యటన