శ్రీనగర్: కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత.. ప్రధాని మోదీ(PM Modi) తొలిసారి ఇవాళ శ్రీనగర్లో పర్యటించనున్నారు. అక్కడ ఆయన అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారు. సుమారు 6400 కోట్ల ఖరీదైన పనులను ఆయన స్టార్ట్ చేయనున్నారు. శ్రీనగర్లో బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు. బక్షీ స్టేడియంలో జరగనున్న వికసిత్ భారత్ వికసిత్ కశ్మీర్ ప్రోగ్రామ్ నేపథ్యంలో ఆయన మాట్లడారు. బక్షీ స్టేడియం వల్ల భారీగా బందోబస్తును పెంచారు. ప్రధాని ర్యాలీ జరిగే ప్రాంతాన్ని త్రివర్ణ పతకాలతో నింపేశారు. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. కశ్మీర్ అంశం మళ్లీ కీలకం కానున్నది. జమ్మూకశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ప్రకటన కూడా చేస్తారేమో అన్న ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.