Ravichandran Ashwin : భారత సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్(Ravichandran Ashwin) కెరీర్లో మరో మైలురాయికి చేరుకున్నాడు. ఈ మధ్యే 500 వికెట్ల క్లబ్లో చేరిన ఈ ఆఫ్ స్పిన్నర్ వందో టెస్టు మ్యాచ్(100 Test Match) ఆడతున్నాడు. ఈ సందర్బంగా ధర్మశాలలో హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్, భారత జట్టు ఆటగాళ్లు అశ్విన్ను ప్రత్యేక అభినందనలు తెలిపారు.
కోచ్ ద్రవిడ్ వందో టెస్టు క్యాప్ను అశ్విన్కు బహూకరించాడు. అనంతరం అతడు భార్య ప్రీతి, ఇద్దరు కూతుళ్లతో కలిసి ఫొటోలు దిగాడు. డ్రెస్సింగ్ రూమ్ నుంచి అశ్విన్ మైదానంలో అడుగుపెట్టేటప్పుడు టీమిండియా ఆటగాళ్లు ఇరువైపులా నిలబడి ‘గార్డ్ ఆఫ్ ఆనర్’తో గౌరవించారు.
💯 reasons to celebrate the moment!#TeamIndia Head Coach Rahul Dravid presents a special memento to @ashwinravi99 on the occasion of his 100th Test match 👏👏
Follow the match ▶️ https://t.co/OwZ4YNua1o#TeamIndia | #INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/vxvw5jQ1z1
— BCCI (@BCCI) March 7, 2024
💯 ✅
Ashwin getting a deserved guard of honour! 👏
📹 @MihirRavani#INDvENG pic.twitter.com/sVTPEFvJeU
— Nikhil 🏏 (@CricCrazyNIKS) March 7, 2024
అశ్విన్ కంటే ముందు 14 మంది భారత క్రికెటర్లు వందో టెస్టు మ్యాచ్ ఆడారు. కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్, అనిల్ కుంబ్లే, దిలీవ్ వెంగ్సర్కార్, ఇషాంత్ శర్మ, సౌరభ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్, ఛతేశ్వర్ పూజారా, విరాట్ కోహ్లీ, హర్భజన్ సింగ్, వీరేంద్ర సెహ్యాగ్, వీవీఎస్ లక్ష్మణ్లు వంద టెస్టులు పూర్తి చేసుకున్నారు. సచిన్ అందరికంటే ఎక్కుడావగా 200 మ్యాచులు ఆడాడు.