హైదరాబాద్: రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. దీంతో రోజురోజుకు విద్యుత్కు డిమాండ్ పెరుగుతున్నది. ఈ క్రమంలో విద్యుత్ సరఫరాలో (Power Suply) తెలంగాణ డిస్కంలు (Telangana Discoms ) కొత్త రికార్డు సృష్టించాయి. రాష్ట్ర చరిత్రలో గతంలో ఎన్నడూ లేనివిధంగా రెండు డిస్కంల పరిధిలో మార్చి 6న 298.19 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా చేశాయి. గతేడాది మార్చి 14న 297.89 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా ఇప్పటి వరకు అత్యధిక రికార్డుగా ఉండేదని అధికారులుత తెలిపారు.
కాగా, బుధవారం రోజున రాష్ట్రవ్యాప్తంగా వినియోగదారులకు 298.19 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా చేసి కొత్త ప్రభుత్వం గత రికార్డులను అధిగమించింది. ఫిబ్రవరి, మార్చి నెలల్లో అత్యధిక డిమాండ్ ఉన్నపటికీ విద్యుత్ సంస్థలు దానికి తగిన విధంగా కరెంటును సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేశాయన్నారు.