టెక్సాస్: అమెరికాలో వరుసగా కాల్పుల ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. టెక్సాస్ రాజధాని ఆస్టిన్లో ఉన్న ఓ అపార్ట్మెంట్ కాంప్లెక్స్ వద్ద దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. దీంతో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. ఆదివారం ఉదయం 11.40 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకున్నది. కాల్పుల అనంతరం ఆగంతకుడు అక్కడి నుంచి పారిపోయాడు. అయితే కాల్పులు జరిపింది స్టీఫెన్ నికోలస్ బ్రోడెరిక్గా పోలీసులు గుర్తించారు. అతడు గతంలో ట్రావిస్ కౌంటీ షరీఫ్ ఆఫీసులో డిటెక్టివ్గా పనిచేశాడని వెల్లడించారు. అతనిపై చిన్నారులను లైంగికంగా హించాడనే ఆరోపణలు ఉన్నాయన్నారు. నికోలస్ కోసం గాలిస్తున్నామని తెలిపారు. కాల్పులు ఎందుకు జరిపాడనే విషయం తెలియాల్సి ఉందని చెప్పారు.
కాగా, ఆదివారం తెల్లవారుజామున విస్కాన్సిన్ రాష్ట్రంలోని సోమర్స్ ప్రాంతంలో ఓ వ్యక్తి కాల్పులు జరిపాడు. సోమర్స్లోని బార్లోకి వచ్చిన దుండగుడు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో ముగ్గురు మరణించగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఇండియానాపోలిస్లో ఇటీవల కాల్పుల్లో 8 మంది చనిపోయిన విషయం తెలిసిందే.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..