మహబూబ్నగర్కు నర్సింగ్ కళాశాల
నెరవేరిన ఎన్నికల హామీ
నాగర్కర్నూల్, మే 30 : నాగర్కర్నూల్ జిల్లాకు ప్ర భుత్వ మెడికల్ కళాశాల మంజూరైంది. దీంతో జిల్లా ప్ర జల చిరకాల కోరిక నెరవేరింది. ఈ మేరకు ఆదివారం ప్రగతిభవన్లో జరిగిన క్యాబినెట్లో ఆమోదం తెలపడంతో జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల హామీలో ఒకటైన మెడికల్ కళాశాల మంజూరుతో నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. 2014, 2018 ఎన్నికల బహిరంగసభల్లో నాగర్కర్నూల్లో మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలన్న అభ్యర్థన మేరకు సీఎం కేసీఆర్ కాలేజీ మం జూరు చేశారని ఎమ్మెల్యే మర్రి హర్షం వ్యక్తం చేస్తూ ము ఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. కళాశాల మంజూరు కావడంతో జిల్లాలోని విద్యార్థులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎంతో కాలంలో ఊరిస్తూ వస్తున్న మెడికల్ కళాశాల ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత మంజూరు కావడం ప్రభుత్వ పనితనంపై వి ద్యాభిమానులు అభినందిస్తున్నారు.
పాలమూరుకు నర్సింగ్ కళాశాల..
సీఎంకు మంత్రి శ్రీనివాస్గౌడ్ కృతజ్ఞతలు
మహబూబ్నగర్, మే 30 : మహబూబ్నగర్ జిల్లా కు నర్సింగ్ కళాశాల మంజూరు చేసినందుకు సీఎం కేసీఆర్కు ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. మహబూబ్నగర్ ప్రభుత్వ వైద్య కళాశాలకు అనుబంధంగా నర్సింగ్ కళాశాలను మంజూరు చేసేందుకు ముఖ్యమంత్రి అంగీకరించారని పేర్కొన్నారు. ఇందుకు అవసరమైన ప్రతిపాదనలు సమర్పించాలని ఆదేశించినట్లు మంత్రి పేర్కొన్నారు. నర్సింగ్ కళాశాల మంజూరుతో జిల్లాలో ఎంతో మందికి ఉపాధి లభిస్తుందని, చదువుకున్న విద్యార్థులకు కళాశాలలో పనిచేసే అవకాశం ఉంటుందని తెలియజేశారు. జిల్లాలోని వా రికి ఇక్కడే ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నా రు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్కు రుణపడి ఉంటామని తెలియజేశారు.