Tenth Exams | పదో తరగతి ప్రశ్నపత్రాలు వాట్సాప్లో వైరల్ అవుతుండటంతో పదో తరగతి పరీక్షలు జరుగుతున్న కేంద్రాలను రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్( CP DS Chauhan ) స్వయంగా గురువారం పరిశీలించారు. ఈ క్రమంలో ఎల్బీనగర్( LB Nagar )లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ముందు సీపీ కారు ఆగింది. దీంతో అక్కడున్న పోలీసులు అప్రమత్తమై సీపీకి సెల్యూట్ చేశారు.
అయితే పరీక్షా కేంద్రంలోకి వెళ్తున్న సీపీని అక్కడ విధుల్లో ఉన్న ఓ మహిళా కానిస్టేబుల్ ఆపింది. సీపీ సర్.. పరీక్షా కేంద్రంలోకి ఫోన్ అనుమతి లేదు అని మహిళా కానిస్టేబుల్ చెప్పింది. దీంతో చౌహాన్ తన వద్ద ఉన్న ఫోన్ను మహిళా కానిస్టేబుల్కు అప్పగించి లోపలికి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా మహిళా కానిస్టేబుల్ను సీపీ డీఎస్ చౌహాన్ అభినందించారు. క్యాష్ రివార్డు రూ. 500 ఆమెకు అందజేశారు సీపీ చౌహాన్. మహిళా కానిస్టేబుల్ కల్పన ఎల్బీనగర్ పోలీసు స్టేషన్లో పని చేస్తోంది. తన విధులను చిత్తశుద్ధితో నిర్వర్తించిన మహిళా కానిస్టేబుల్పై ప్రశంసల వర్షం కురుస్తోంది.
Today #CP_RCK Sri. DS Chauhan on inspection of the 10th Class examination at Govt School LBNagar, a WPCO Kalpana of @lbnagarps reminded Commissioner to handover the mobile phone before entering the school. She has #rewarded ₹500 for reminding the rules & doing her duty properly. pic.twitter.com/f9hi4gLSLn
— Rachakonda Police (@RachakondaCop) April 6, 2023