మహేశ్వరం : గిరిజన తండాల అభివృద్దికి కృషి చేస్తానని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు.మంగళవారం గంగారం గ్రామ సర్పంచ్ సాలీ వీరానాయక్ ఆధ్వర్యంలో తండాలో సీసీ రోడ్లు ఏర్పాటుచేయాలని మంత్రిని కోరారు.
ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గ్రామాలు అభివృద్ది చెందితేనే రాష్ట్రాలు అభివృద్ది చెందుతాయనే ఉద్దేశ్యంతోనే తెలంగాణ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి పెద్ద పీట వేసి ఆదుకుంటుందని అన్నారు.
తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి మన తండా మన పాలన అనే విధంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందని ఆమె అన్నారు. రాష్ట్రం ఏర్పాటైన తర్వాతనే ఇచ్చిన మాట ప్రకారం తండాలను పంచాయతీలుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో ఎస్టీసెల్ మాజీ అధ్యక్షులు రవీందర్నాయక్, పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు పాండునాయక్, ఉపాధ్యక్షులు కావలి యాదగిరి, ఎస్సీ సెల్ అధ్యక్షులు క్రిష్ణ, బీసీ సెల్ అధ్యక్షులు కోటేష్ గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.