హైదరాబాద్ : రాష్ట్రంలోని సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అన్నారు. ఈ మేరకు గురువారం కార్ఖానాలో తన క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే సాయన్న పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడాలేని సంక్షేమ, అభివృద్ధి పథకాలు రాష్ట్రంలో ప్రవేశపెట్టిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. 2014కు ముందు ఆడబిడ్డ పెండ్లి చేయాలంటే పేదలు అప్పు తెచ్చేవారని, టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ కింద ఆర్థిక సాయం చేస్తూ ఆదుకుంటున్నారని కొనియాడారు.
ఈ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని పేర్కొన్నారు. ప్రజలకు సేవ చేయాలనే దృక్పథంతో పథకాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో బోయిన్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ టీఎన్ శ్రీనివాస్, బోర్డు మాజీ సభ్యుడు శ్యాంకుమార్, నేతలు నివేదితా, ఆకుల హరికృష్ణ, పిట్ల నగేష్, ముప్పిడి మధుకర్, లతామహేందర్, పనస సంతోష్, రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
అన్లాక్ : 7 నుంచి స్కూల్స్, థియేటర్లు ఓపెన్
అదే ఆయన స్పెషల్..ఊరోళ్లతో ముచ్చటంటే సంబుర పడుతడు
Madhuri Dixit song : ఒలింపిక్స్లో మధురీ దీక్షిత్ పాట.. ఎందుకంటే..?