కవాడిగూడ : పోరాట స్పూర్తిని చాటిని వీర వనిత చాకలి ఐలమ్మ అని రాష్ట్ర పశుసంవర్ధక శాఖా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఈ మేరకు ఆదివారం లోయర్ ట్యాంక్బండ్లోని తెలంగాణ రజక దోబీఘాట్ అభివృద్ది సంస్థ భవన్ వద్ద చాకలి ఐలమ్మ 126 వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ముందుగా ఐలమ్మ విగ్రహానికి కేంద్ర ఈశాన్య రాష్ట్రాల సాంస్కృతిక, పర్యాటక శాఖా మంత్రి జి. కిషన్రెడ్డి, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కే. లక్ష్మణ్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, జిల్లా కలెక్టర్ శర్మన్, పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ పెత్తందారి వ్యవస్థకు వ్యతిరేకంగా అనేక భూ పోరాటాలు, పేద ప్రజల సమస్యలపై అలుపెరుగని పోరాటం చేసిన ధీర వనిత చాకలి ఐలమ్మ అని ఆయన అన్నారు. సబ్బండ వర్గాల ఆత్మగౌరవం, మహిళా చైతన్యానికి ఆమె ప్రతీకగా నిలిచారని అన్నారు. ఆమె ఉధ్యమ స్పూర్తిని స్మరించుకుంటూ ఐలమ్మ జయంతి, వర్ధంతిని అధికారికంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశించిందని ఆయన చెప్పారు.
తెలంగాణ ప్రభుత్వం పోరాట యోధులను ఎప్పుడూ గౌరవిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఐలమ్మ పోరాటాలకు గుర్తుగా భవిష్యత్తు తరాలకు ఆమె చరిత్రను తెలియజేసే విధంగా ప్రభుత్వం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుందని అన్నారు. హైదరాబాద్లో 3 ఎకరాల విస్తీర్ణంలో రూ. 5 కోట్ల ఖర్చుతో స్మారక భవనం నిర్మిస్తుందని అన్నారు. అదే విధంగా 5వ తరగతిలో ఐలమ్మ జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చి ఆమెకు సముచిత గుర్తింపు, గౌరవాన్ని తెలంగాణ ప్రభుత్వం కల్పించిందని అన్నారు.
కేంద్ర మంత్రి జి. కిషన్రెడ్డి మాట్లాడుతూ చాకలి ఐలమ్మ ఉద్యమ స్పూర్తిని మరువలేనిదని అన్నారు. ఆనాడు నిజాం నవాబులను ఎదురించి పోరాడిన మహా వ్యక్తి వీరనారి చాకలి ఐలమ్మ అని గుర్తు చేశారు.
ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ తాడిత పీడిత వర్గాల విముక్తి కోసం పోరాడిన వీరవనిత చాకలి ఐలమ్మ అని ఆయన గుర్తు చేశారు. రజకుల అభివృద్దికి సీఎం కేసీఆర్ అహర్నిషలు కృషి చేస్తున్నారని అన్నారు. ఉచిత విత్యుత్ను ఇచ్చిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కిందని అన్నారు. రజకుల వెన్నంటి ఉంటూ వారికి సంక్షేమానికి తన వంతు కృషి చేస్తానని ఆయన అన్నారు.
హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శర్మన్ మాట్లాడుతూ చాకలి ఐలమ్మ తెలంగాణ జాతికి ఉద్యమ స్పూర్తిని ఇచ్చిన వీరనారి అని ఆయన అన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న ఉచిత విద్యుత్ను ప్రతి సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.