US Consulate | తాపీ మేస్త్రీ (Masonry)లు.. ఇంటి నిర్మాణంలో వీరి పాత్ర చాలా కీలకం. వీరు రోజూవారీ కూలీలుగా పనిచేస్తుంటారు. రోజుకు ఎంతలేదనుకున్నా.. వెయ్యి రూపాయల నుంచి రూ.1,500 వరకూ సంపాదించగలరు. కానీ వారికి ప్రతిరోజు పని దొరకడం చాలా కష్టం. ఇక వర్షాకాలం అయితే మరీ దారుణం.. ఇంట్లో కూర్చోవాల్సిందే. అలాంటి వారికోసం ఓ సంస్థ బంపర్ ఆఫర్ ఇచ్చింది. తాపీ మేస్త్రీ కోసం ఏకంగా ఉద్యోగ నియామకం చేపట్టింది. తాపీ మేస్త్రీ కావాలెను అంటూ సోషల్ మీడియాలో ప్రకటన ఇచ్చింది. భారీ వేతనాన్ని కూడా ఆఫర్ ఇచ్చింది.
ఇంతకీ ఆ సంస్థ ఏంటనుకుంటున్నారా..? తెలుగు రాష్ట్రాల పరిధిలో వీసా సేవలు అందించేందుకు హైదరాబాదులో ఏర్పాటైన అమెరికా కాన్సులేట్ జనరల్ (U.S. Consulate General Hyderabad). ఏకంగా రూ.4.47 (4,47,349) లక్షల వార్షిక వేతనంతో ఈ ఉద్యోగ నియామకం చేపట్టింది. ఈ వేతనానికి తోడు ఇతర ప్రయోజనాలు కూడా ఉంటాయని వెల్లడించింది. కనీస విద్యార్హత ఎనిమిదో తరగతని, తప్పనిసరిగా ఆంగ్ల భాష వచ్చి ఉండాలని, హిందీ లేదా తెలుగు భాషలు మాట్లాడగలిగి ఉండాలని నిబంధన విధించింది.
ఫ్లోరింగ్, మార్బుల్ ఫ్లోరింగ్, కాంక్రీట్ బ్లాక్స్ వాల్, స్టోన్ లేయింగ్, కట్టింగ్, బ్రిక్ వర్క్ తదితర పనుల్లో కనీసం రెండేళ్లైనా అనుభవం ఉండాలని పేర్కొంది. అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఫిబ్రవరి 25గా పేర్కొంది. పూర్తి వివరాల కోసం https://in.usembassy.gov/embassy-consulates/jobs/hyderabad/ వెబ్సైట్ను సంప్రదించవల్సిందిగా తెలిపింది. తాపీమేస్త్రీ నియామక దరఖాస్తులు ఎలక్ట్రానిక్ పద్దతిలో మాత్రమే ఆమోదించబడతాయని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఈ నియామక నోటిఫికేషన్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. డిగ్రీలు చదివినవారికి కూడా ఈ స్థాయిలో వేతనాలు రాక ఇబ్బంది పడుతున్నారని.. అలాంటిది తాపీ మేస్త్రీకి ఇంత వేతనం ఆఫర్ చేయడం గ్రేట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
తాపీ మేస్త్రి కావలెను
గ్రేడ్ : FSN-04
చివరి తేది: 25 Feb, 2024
వార్షిక పరిహారం : 4,47,348/- (Per Year)+ ఇతర ప్రయోజనాలు
అమెరికన్ కాన్సులేట్ తాపీ మేస్త్రి కోసం నియామకాన్ని ఆహ్వానిస్తుంది.
దరఖాస్తు ప్రక్రియ వివరాల కోసం దయచేసి సందర్శించండిhttps://t.co/zNdz8y9qr8
దరఖాస్తులు… pic.twitter.com/y9KWDnUbiU— U.S. Consulate General Hyderabad (@USAndHyderabad) February 6, 2024
Also Read..
Babu Mohan | బీజేపీకి బాబూ మోహన్ రాజీనామా.. తనకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదంటూ ఆవేదన
India Corona | 24 గంటల్లో 157 మందికి కొవిడ్ పాజిటివ్.. ఇద్దరు మృతి
Chennai | మూవింగ్ బస్సులో పెద్ద రంధ్రం.. తృటిలో తప్పించుకున్న మహిళ.. VIDEO