హైదారాబాద్ : డిగ్రీ కాలేజీ ప్రవేశాల్లో సిటీ కాలేజీకి అనూహ్య స్పందన లభించిందని సిటీ కాలేజీ ప్రిన్సిపల్ బాలభాస్కర్ తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. సిటీ కాలేజీకి ప్రభుత్వం 1500 సీట్లు కేటాయించిందన్నారు. డిగ్రీ ప్రవేశాల్లో భాగంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన దోస్త్ అప్లికేషన్ను ఉపయోగించుకున్న విద్యార్థులు సిటీ కాలేజీని అత్యధిక సంఖ్యలో తమ ప్రాధాన్యత కాలేజీగా ఎంచుకున్నారు.
ఫలితంగా ఫేజ్-1లోనే సిటీ కాలేజీలో ప్రభుత్వ అనుమతుల మేరకు 1500 సీట్లను విద్యార్థులకు కేటాయించిట్లు ప్రిన్సిపాల్ బాలభాస్కర్ తెలిపారు. దోస్త్ కన్వీనర్, కళశాల విద్యా కమిషనర్ సూచించిన విధంగా విద్యార్థులు కాలేజీ ప్రవేశాల్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుందని ప్రిన్సిపాల్ తెలియజేశారు. దోస్త్లో సీటు పొందిన విద్యార్థులు స్వీయంగా హాజరుకాని పక్షంలో వారి సీట్లను ఫేజ్-2లో భాగంగా ఆప్షన్లు ఇచ్చిన వారికి మెరిట్ మార్కుల ఆధారంగా ఇతర విద్యార్థులకు కేటాయిస్తామని తెలిపారు.
అన్లాక్ : 7 నుంచి స్కూల్స్, థియేటర్లు ఓపెన్
అదే ఆయన స్పెషల్..ఊరోళ్లతో ముచ్చటంటే సంబుర పడుతడు
Madhuri Dixit song : ఒలింపిక్స్లో మధురీ దీక్షిత్ పాట.. ఎందుకంటే..?
రాష్ట్రంలోని యూనివర్సిటీలకు చేయూతను అందించాలి