న్యూఢిల్లీ: బీహార్ స్వతంత్ర ఎంపీ పప్పు యాదవ్పై హత్యాయత్నం జరిగింది. ఢిల్లీలోని తన నివాసంలో ఆదివారం మీడియాతో మాట్లాడుతుండగా, అక్కడకు ప్రవేశించిన ఒక వ్యకి ఎంపీపై చెప్పు విసిరాడు. అతడిని ఎంపీ మద్దతుదారులు పట్టుకోవడంతో తీవ్ర తోపులాట, గందరగోళం చోటుచేసుకుంది.
ఆ సమయంలో అతని వద్ద కత్తి కూడా ఉన్నట్టు గుర్తించారు. అయోధ్య రామమందిర విరాళాల చోరీపై పార్లమెంట్ ప్రాంగణంలో కొన్ని రోజుల క్రితం పప్పు యాదవ్ వ్యంగ్యంగా ఒక స్కిట్ ప్రదర్శించిన క్రమంలో ఈ దాడి చోటుచేసుకుంది. దాడికి పాల్పడిన వ్యక్తిని యూపీలోని బులంద్షహర్కు చెందిన సుమిత్ (34)గా గుర్తించారు. తర్వాత అతడిని పోలీసులకు అప్పగించారు.