హైదరాబాద్ : క్రికెట్ ఆడటానికి స్కూటీపై వెళ్తూ ఇద్దరు బాలురు మృతి చెందారు. ఈ విషాదకర సంఘటన కూకట్పల్లిలో చోటు చేసుకుంది. ముగ్గురు బాలురు క్రికెట్ ఆడేందుకు స్కూటీపై వెళుతుండగా స్కూటీని టిప్పర్ ఢీ కొట్టడంతో మహేష్(17), లక్ష్మీతేజ(17) అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని టిప్పర్ను సీజ్ చేశారు. డ్రైవర్ పరారీలో ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
Tej Pratap Yadav | విద్యార్థులకు మద్దతుగా ఆందోళన.. జేజేపీ చీఫ్ అరెస్ట్.. 14 రోజుల రిమాండ్
Houthis attacks | సౌదీ అరేబియాపై డ్రోన్లు, క్షిపణులతో హుతీల భారీ దాడులు
Sarnath | బుద్ధుడు తొలి ఉపన్యాసం ఇచ్చిన సారనాథ్కు యునెస్కో గుర్తింపు