అబిడ్స్ : దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం కొనసాగుతోందని రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలి పేర్కొన్నారు. మంగళ్హాట్ డివిజన్ మాజీ కార్పొరేటర్ పరమేశ్వరిసింగ్ ఆధ్వర్యంలో రహీంపురాలో నిర్వహించిన టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
అనంతరం ఆయన ప్రసంగిస్తూ 21 సంవత్సరాలుగా పార్టీ ప్రజలకు అండగా నిలుస్తోందని, తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు చేపడుతున్న సంక్షేమ పథకాలు ప్రజాకర్శక పథకాలుగా నిలుస్తున్నాయని వివరించారు. సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పరమేశ్వరిసింగ్ మంత్రి మహమూద్అలితో పాటు నాయకులను సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మహమూద్అలి టీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో గోషామహల్ నియోజకవర్గం టీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జ్ ప్రేమ్సింగ్ రాథోడ్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నందకిషోర్ వ్యాస్, పుస్తె శ్రీకాంత్, శీలం సరస్వతి, మాజీ కార్పొరేటర్ ముఖేష్సింగ్, శాంతిదేవి, పూజా వ్యాస్ బిలాల్, శశిరాజ్సింగ్, జై శంకర్, మాడిశెట్టి సదానందం గుప్తా తదితరులు పాల్గొన్నారు.