ఎల్బీనగర్, ఆగస్టు 13 : దళితుల గుండెల్లో సీఎం కేసీఆర్ నిలిచిపోయాడని ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్త అన్నారు. చైతన్యపురికి చెందిన కేవీఎన్ స్ఫూర్తికి రూ. 60 వేల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును ఎమ్మెల్సీ దయానంద్ గుప్తా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..దళిత బంధు పథకాన్ని తీసుకుని వచ్చి సీఎం కేసీఆర్ దళితుల జీవితాల్లో వెలుగులు తెస్తున్నారని ప్రశంసించారు.
సీఎం కేసీఆర్ న్యాయకత్వంలో పేదలకు అనేక సంక్షేమ పథకాలు అందుతున్నాయని పేర్కొన్నారు. అధునాతన వైద్య సేవలను పేదలకు అందిస్తూ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ప్రభుత్వం చేయుతను అందిస్తోందన్నారు.