Hyderabad | రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ సుజాత స్కూల్లో విషాదం చోటుచేసుకుంది. స్విమ్మింగ్పూల్లో పడి రెండో తరగతి విద్యార్థి మృతి చెందారు.
వివరాల్లోకి వెళ్తే.. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం నాగిరెడ్డిగూడ గ్రామ పరిధిలోని గాల సుజాత స్కూల్లో సమ్మర్ క్యాంపులో భాగంగా పిల్లలకు స్విమ్మింగ్లో ట్రైనింగ్ ఇస్తున్నారు. సురంగల్ గ్రామానికి చెందిన శివ శౌర్య (7) కూడా అదే స్కూల్లో ఈత శిక్షణ పొందుతున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం నాడు స్విమ్మింగ్ ట్రైనింగ్ తీసుకుంటూ ప్రమాదవశాత్తూ నీట మునిగి మరణించాడు.
అయితే ఈ విషయం బయటకు రాకుండా స్కూల్ యాజమాన్యం దాచే ప్రయత్నం చేసింది. కానీ విషయం తెలుసుకున్న పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు స్కూల్ పీఈటీలకు దేహశుద్ధి చేశారు.