SHE Teams | హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తించే వారి పట్ల కఠిన చర్యలు తీసుకుంటామని షీ టీమ్స్ సిటీ మహిళా భద్రత డీసీపీ దార కవిత హెచ్చరించారు. బాధిత మహిళలు ధైర్యంగా షీ టీమ్స్కు ఫిర్యాదు చేయాలని ఆమె సూచించారు.
ఇటీవల గణేష్ నిమజ్జనం సందర్భంగా ఖైరతాబాద్లోని బడా గణేష్, రద్దీగా ఉండే ఇతర గణేష్ మండపాలతో పాటు నిమజ్జనం సమయంలో మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తించిన 996 మందిని షీ టీమ్స్ రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. అందులో 200 మందికి మూడు రోజుల పాటు జైలు శిక్ష, ఒక్కొక్కరికి రూ. 1050 జరిమానాను విధిస్తూ కోర్టు తీర్పు చెప్పిందని డీసీపీ వివరించారు. మిగతా వారికి వారి వారి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించినట్లు తెలిపారు. రద్దీ ప్రాంతాలలో మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తిస్తే ఎవరు చూడరనే భావనలో ఉండేవారు తమ మైండ్సెట్ను మార్చుకోవాలని, షీ టీమ్స్ నిఘా నిరంతరం కొనసాగుతుందని డీసీపీ హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి..
Posani Krihsna Murali | బాలకృష్ణకు వ్యతిరేకంగా పోసాని సంచలన వ్యాఖ్యలు..!
Cannabis | ఖమ్మంలో రూ. 4 కోట్ల విలువ చేసే గంజాయి దహనం