కాచిగూడ,ఆగస్టు 26 : గుర్తుతెలియని ద్విక్రవాహనం ఢీ కొనడంతో భార్య,భర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన కాచిగూడ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై బద్దుల నాగార్జునరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గోల్నాక డివిజన్ ఆర్టీసీ క్వార్టర్స్ ప్రాంతానికి చెందిన భార్య,భర్తలు జి.కృష్ణకుమార్,సునీత కిరణా సమాన్లు తీసుకురావడానికి ద్విచక్రవాహనంపై నింబోలిఅడ్డాకు వెళ్లారు.
తిరిగి ఇంటికి వస్తుండగా మార్గమధ్యలో హనుమాన్ దేవాలయ సమీపంలో గుర్తు తెలియని ద్విక్రవాహనం కృష్ణకుమార్, సునీతను ఢీకొనడంతో వారికి తలకు, ఎడమ చేతులకు తీవ్రంగా గాయాలయ్యాయి. కృష్ణకుమార్ కాచిగూడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు కాచిగూడ పోలీసులు తెలిపారు.