Online Matrimonial fraud | ప్రస్తుత యువ ప్రపంచం అంతా ఫ్యాషన్, అందం మాయలో పడి అగాథాన్ని వెతుక్కుంటోందనడానికి నగరంలో చోటు చేసుకున్న ఈ ఘటన ఒక ప్రత్యేక ఉదాహరణ. అందం, ఆకర్షణ మాయలో పడి ఒక యువకుడు కండ్లు మూ సుకుపోయి కోటి రూపాయలను గుడ్డిగా బదిలీ చేశాడు. ఆ అందం చాటున ఎంత మోసం దాగుందో.. ఆ తరువా త గాని సదరు వ్యక్తికి తెలియలేదు. అవగాహన లేమితో ఉన్న కొంతమంది యువకులను మోసపుచ్చేందుకు ఎంతో మంది పడిగాపులు కాస్తున్నారు. అయితే, ఎఫ్బీ (ఫేస్బుక్ – facebook ) నకిలీ ఖాతాలో అందమైన అమ్మాయి ప్రొఫైల్ ఫొటోతో నగరానికి చెందిన యువకుడిని పరిచయం చేసుకొని ఆపై పెండ్లి చేసుకుంటానంటూ నమ్మించి కోటి రూపాయలు కొట్టేసిన కిలాడీ దంపతులను సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను సీసీఎస్ జా యింట్ సీపీ అవినాష్ మహంతి మాటల్లో..
కళ్యాణిశ్రీ పేరుతో ఫేస్బుక్లో వచ్చిన ఫ్రెండ్ రిక్వెస్ట్ను బొల్లారానికి చెందిన ఒక యువకుడు యాక్సెప్ట్ చేశాడు. ప్రొఫైల్లో అందమైన ఫొటో ఉండటంతో ఇద్దరు కొన్నా ళ్లు చాట్ చేశారు. తరువాత పెండ్లి చేసుకుందామని మా ట్లాడుకున్నారు. ఈ క్రమంలోనే తనకు రూ.50 కోట్ల వి లువైన ఆస్తులున్నాయని, వాటిని తన పేరుపై మార్చుకోవాలని, అందుకు కొంత ఖర్చవుతుందంటూ సైబర్ నేరాలకు పాల్పడుతూ సదరు వ్యక్తిని నమ్మించి కోటి రూపాయలు కొట్టేశారు. దీంతో బాధితుడు ఈ నెల 12వ తేదీన సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఏసీపీ కేవీఎం ప్రసాద్ నేతృత్వంలో ఇన్స్పెక్టర్ వెంకట్రామిరెడ్డి, ఎస్సై మధుసూదన్ రావు బృందం కేసును చేపట్టింది.
గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చెందిన యెర్రగుండ్ల దా సు, జ్యోతి దంపతులు. నూజువీడులోని ఐఐఐటీ కాలేజీలో దాసు బీటెక్ పూర్తి చేసి 2014లో టీసీఎస్లో ఉద్యోగం చేశాడు. ఆ క్రమంలో ఆన్లైన్ రమ్మీ ఆటకు బానిసయ్యాడు. ఉద్యోగానికి సక్రమంగా రాకపోవడంతో టీఎస్ఎస్లో ఉద్యోగం నుంచి తొలగించారు. 2017లో జ్యోతి ని పెండ్లి చేసుకొని, తన స్వస్థలంలో వ్యవసాయం చేశా డు. 2019లో సత్తెనపల్లికి జీవనోపాధి కోసం వచ్చి పండ్ల విక్రయాలు చేస్తూ జీవనం సాగించేవారు. 2019లో ఏపీ ప్రభుత్వం ఆన్లైన్ రమ్మీని నిషేధించింది. దీంతో క్రికెట్ బెట్టింగ్ యాప్లలో బెట్టింగ్ పెట్టడం ప్రారంభించాడు. ఇలా బెట్వే, ఇన్డిబెట్, బెట్ డాడీస్ తదితర క్రికెట్ బె ట్టింగ్ యాప్లలో వచ్చిన సొమ్మంతా పెట్టుబడి పెడుతుండేవాడు. చేతిలో డబ్బు లేకపోవడంతో ఏదో ఒకటి చేసి డబ్బు సంపాదించాలని దంపతులిద్దరు ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా 2013లో బీటెక్ చదువుతున్న సమయంలో కళ్యాణిశ్రీ పేరుతో తయారు చేసిన నకిలీ ఫేస్బుక్ ఐడీ దాసుకు గుర్తొచ్చింది. ఐడీకి అందమైన అమ్మాయి ఫొటో పెట్టి అందరికి రిక్వెస్ట్ పంపించాడు.
కళ్యాణిశ్రీ ఐడీ ఫ్రెండ్ రిక్వెస్ట్కు నగరానికి చెందిన విజయ్రెడ్డి పేరుతో ఉన్న ఐడీతో బాధితుడు అంగీకరించాడు. ఇద్దరు కొన్నాళ్లు చాటింగ్ చేశారు. ఇద్దరికి పెండ్లి కాలేదని మాట్లాడుకున్నారు. అయితే, తనకు వారసత్వంగా రూ.50 కోట్లకుపైగా ఆస్తులున్నాయని, మా నాన్న చనిపోయాడు. ఆ ఆస్తిని నా పేరుపైకి మార్చుకోవాలి. అందుకు కొంత ఖర్చవుతుందంటూ కళ్యాణి అడగడంతో విజయ్రెడ్డి అంగీకరించాడు. ఈ క్రమంలోనే కళ్యాణిశ్రీ పేరుతో చాట్ చేసిన దాసు, అతని భార్య జ్యోతితో కూడా మాట్లాడించాడు. ఆస్తి తన పేరుపైకి రాగానే కొంత పొలం కూడా రిజిస్ట్రేషన్ చేస్తానని, ఆ తరువాత పెండ్లి చేసుకుందామంటూ నమ్మించారు. ఆ మాటలు విన్న విజయ్రెడ్డి దఫ దఫాలుగా జ్యోతి పేరుపై ఉన్న రెండు బ్యాంకులలో కోటి రూపాయలు డిపాజిట్ చేశాడు. వచ్చిన డబ్బుతో దాసు దంపతులు కొంత విలాసాలకు ఖర్చుపెట్టగా, బెట్టింగ్ యాప్లలో మరికొంత వెచ్చించారు. సత్తెనపల్లిలో రూ.4 లక్షలతో కొత్త స్థలాన్ని కొని దాసు తన తండ్రి పేరుపై రిజిస్ట్రేషన్ చేయించారు. 12 తులాల బంగారం కొని దానిని తనఖా పెట్టిన సొమ్ముతో బెట్టింగులలో పెట్టుబడులు పెట్టినట్లు విచారణలో వెల్లడైంది. కేసు దర్యాప్తులో భాగంగా సాంకేతిక ఆధారాలు సేకరించి, బాధితుడిని మోసం చేసిన దంపతులను అరెస్ట్ చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు పంపించే ఫ్రెండ్ రిక్వెస్ట్లతో మోసపోవొద్దని, లావాదేవీలు చేయొద్దని జాయింట్ సీపీ సూచించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
అమెజాన్లో వర్క్ ఫ్రమ్ హోం ఉద్యోగాలు.. సైబర్ నేరగాళ్ల సరికొత్త మోసం
ఆరితేరిన సైబర్ మోసగాళ్లు.. ఇలా కూడా మోసాలు చేసేస్తున్నారు
పెండ్లి చేసుకుందాం.. అమెరికా పోదామంటూ సాఫ్ట్వేర్ యువతికి మస్కా.. 21 లక్షలు నొక్కేసిన కేటుగాడు
Cyber fraud helpline number|24 గంటల్లోపు ఈ నంబర్కు కాల్ చేస్తే పోయిన డబ్బులు వచ్చేస్తాయి
సైబర్ మోసగాళ్ల బారిన పడ్డారా..ఈ నంబర్కు ఫిర్యాదు చేయండి!